Bonthu Rammohan: పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష బీఆర్ఎస్కు మరో బిక్ షాక్. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇవాళ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. విద్యార్థి నేతగా ఉంటూ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన రామ్మోహన్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ బాట పట్టారు. పట్నం సునీతా మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్ నేత మోతె శోభన్రెడ్డి తదితరులు ఇవాళ కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం.
Read also: Students Gang War: ఓ అమ్మాయి కోసం స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. చెన్నై రైల్వే స్టేషన్ లో ఘటన
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని రామ్మోహన్ భావిస్తున్నారని, ఇదే విషయాన్ని సీఎం రేవంత్ వద్ద ప్రస్తావించగా.. పరిశీలిస్తానని చెప్పినట్లు సమాచారం. విద్యార్థి దశలోనే ఏబీవీపీ, ఆ తర్వాత బీజేవైఎంలో క్రియాశీలకంగా పనిచేసిన బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన రామ్మోహన్కు మేయర్గా అవకాశం దక్కింది. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రామ్మోహన్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ భేతి సుభాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ కోసం ప్రయత్నించి మరోసారి నిరాశ చెందారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా అవకాశం కల్పించాలని రామ్మోహన్ బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరినట్లు తెలిసింది.
Read also: Helicopter for Medaran Jatara: మేడారం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. హనుమకొండ నుంచి హెలికాప్టర్
కానీ, వారి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్తో ఆయన భేటీ అయినట్లు సమాచారం. ఇప్పటికే జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇటీవల సీఎంను కలిశారు. అది పరిపాలనా కారణాల వల్ల అని ఆమె చెప్పినప్పటికీ. అన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు పార్టీని వీడనున్నారనే ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా గెలవని సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభ ఎన్నికల నాటికి గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తున్నాం. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల నియామకంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే 14 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పార్టీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Autos Strike Today: నేడు ఆటోలు బంద్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు