Chiranjeevi – Tamilisai: 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి చిరు భద్రతా కార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Donors Honourned In Raj Bhavan By Chiranjeevi and Tamilisai: చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్భవన్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘చిరు భద్రతా కార్డు’లను గవర్నర్ తమిళిసై అందజేశారు. రక్తదాతలను సత్కరించి.. లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలపై గవర్నర్, చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిరు మాట్లాడుతూ.. 1998లో తాను బ్లడ్ బ్యాంక్ ప్రారంభించానని, దాని వెనుక ఎంతో కృషి ఉందని అన్నారు. ఆ రోజుల్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉండేదని, రక్తదానం చేసే వాళ్లు తక్కువ మందే ఉండేవారన్నారు. అప్పుడు తనకు బ్లడ్ బ్యాంక్ ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన ఫ్యాన్స్ కూడా సహకరించారని చెప్పారు. ఫ్యాన్స్గా నా సినిమాలు చూడటం, నన్ను కలవడం, ఫోటోలు దిగడం కంటే.. రక్తదానం చేయడమే తనకు ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలిపారు. రక్తదానం చేస్తున్న ప్రతీ అభిమానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు సరుకులు అందిస్తున్నప్పుడు, తనని ప్రోత్సాహించిన మొదటి వ్యక్తి గవర్నర్ అని చిరంజీవి పేర్కొన్నారు. గవర్నర్ ఎన్నోసార్లు ట్వీట్ చేసి, ఎంకరేజ్ చేశారన్నారు.
అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. తాను హౌజ్ సర్జన్గా ఉన్నప్పుడు, తమ కుటుంబంలోనే ఒకరికి రక్తం అత్యవసరమైందని.. ఆ టైంలో పేషెంట్ని చూసేందుకు చాలామంది వచ్చారని అన్నారు. అప్పుడు ఆ పేషెంట్కి రక్తం కావాలన్నానని, ఎవరైనా దానం చేస్తారా అని అడిగానని, అలా అడిగే సరికి అందరూ అక్కడి నుంచి జారుకున్నారని వెల్లడించారు. రక్తదానం అంత సులువు కాదని, ఒక డాక్టర్గా తాను ఎన్నో సంఘటనలు చూశానని పేర్కొన్నారు. రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్స్ని చూశానని, రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశానని తమిళిసై చెప్పుకొచ్చారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
తాజావార్తలు
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!