Hydershahkote Black Magic: హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీ మనీకోసం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షుద్రపూజల పేరుతో హడావిడి చేస్తున్నారు.. దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పుడు స్కూళ్లను కూడా వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో క్షుద్రపూజలు జరగడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ స్కూల్ లో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్ సైన్స్ లాబ్ తో పాటు స్టోర్ రూమ్ ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ క్షుద్రపూజల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్నారు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు. స్కూల్లోని సీసీ కెమేరాలు మాయమవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ క్షుద్రపూజలు చేసిందెవరు? దీనికి వెనుక ఎవరున్నారు అనేది దర్యాప్తులో తేలనుంది.

Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఇలాంటి క్షుద్రపూజలు దేశవ్యాప్తంగా జరుగుతూనే వున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోట్లు సంపాదించాలంటే మూఢనమ్మకాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందంటూ బాలికను బలవంత పెట్టారు. ఇలాంటి ఘటనలు చట్టరీత్యా నేరం. అలాంటి వారిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేయవచ్చు.
Read Also: Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
మహారాష్ట్రలో అదే జరిగింది. క్షుద్రపూజలు చేస్తే.. కనకవర్షం కురుస్తుందని నమ్మించారు.తాము చెప్పినట్లు క్షుద్రపూజలు చేస్తే కోటీశ్వరురాలివి అవుతావని ఆశపెట్టారు. దీనికోసం కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని సూచించారు. దీనికి అంగీకరించిన ఆ బాలిక క్షుద్రపూజలు చేయడానికి అంగీకరించారు. ఎక్కడో చోట ఏదో విధంగా ఈజీ మనీ పేరుతో ఇలాంటివి జరుగుతూనే వున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో పాడుబడిన భవనాల దగ్గర తవ్వకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లంకె బిందెలు వుంటాయని, మీరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని నమ్మబలుకుతున్నారు. మంత్రాలు, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, వివిధ రకాల వస్తువులు, అస్తిపంజరాలు లభిస్తున్నాయి. రోడ్ల మీద నిమ్మకాలు దిష్టి తీసి పడేయడంతో అటుగా వెళ్ళేవారు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా వుండాలని, క్షుద్రపూజలు చేస్తే ఎలాంటి సంపద రాదంటున్నారు శాస్త్రవేత్తలు., సామాజికవేత్తలు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!