Bandi Sanjay: బీజేపీ శ్రేణులపై దాడులు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు బండిసంజయ్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ నాయకులపై దాడులను నిరసనగా ఆందోళనకు పిలుపు నిచ్చారు. బండిసంజయ్. తమ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. అయితే.. ఎమ్మల్సీ కవిత ఇంటి వద్ద కొందరు బీజేపీ నేతలు భాజపా నాయకులు నిరసన చేపట్టిన వారిని పోలీసులు అదుపులో తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బీజేపీ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే హత్యాయత్నం కేసులు పెడతారా అని నిలదీశారు. తమ నేతలపై వారే దాడులు చేసి బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దాడి చేయడంతో.. బీజేపీ నేతలకు గాయాలవడంతో.. వారిని ఆసుపత్రికి తరలించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక లిక్కర్ స్కామ్ పై నిజాలు తేల్చెంత వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ మద్యం పాలసీ తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది.
కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని, దర్యాప్తుకు సహకరిస్తా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను మానసికింగా కుంగిపోతానని వారు అనుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read
ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్ట దావా వేయనున్నారు. బీజేపీఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా పై పరువు నష్టం దావాకు వేసేందుకు కవిత సిద్దమయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును అశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. లిక్కర్ స్కాం దర్యాప్తులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్ళై ఇంట్లో సీబీఊ సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కాంలో ఏ15గా రామచంద్ర పిళ్ళై, రాబిన్ డిస్టిలరీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండున్నరకోట్లు ఢిల్లీ పెద్దలకు ఇచ్చినట్టు ఆధారాలు వున్నాయని సీబీఐ తెలిపిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి.
Priyanaka Gandhi: తెలంగాణ కాంగ్రెస్పై ప్రియాంక గాంధీ ఫోకస్
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!