హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందనే 50 వేల ఉద్యోగాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ, ఖాళీల గుర్తింపు తదితర అంశాలపై కసరత్తు సాగుతోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందనే 50 వేల ఉద్యోగాలు అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు… ప్రతి ఎలక్షన్ సమయంలో 50 వేల ఉద్యోగలు ఇస్తానని సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు గుర్తుకు వస్తున్నాయి.. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ వస్తున్నాయనే 50 వేల ఉద్యోగాలు అంటున్నారని మండిపడ్డారు.. ఇక, కోనప్పకు ధైర్యం ఉంటే పోడుభూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడాలంటూ సవాల్ విసిరారు ఎంపీ సోయం బాపురావు.. పోడు భూముల విషయంలో అదివాసులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!