Etela Rajender Fires on Harishrao: ఆ మీటింగ్ కి హరీష్ ఎందుకెళ్లలేదు? ఈటల ఫైర్
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఢిల్లీలో నిన్న జరిగిన బడ్జెట్ రూపకల్పన మీటింగ్ కి హాజరుకాకపోవడంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆయా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చేశారు. మంత్రులు, ఆఫీసర్లతో మీటింగ్ పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేసుకోనేవారు.. కానీ కెసిఆర్ ఆ సంప్రదాయాన్ని ఖతం పట్టించారని విమర్శించారు ఈటల రాజేందర్.
Read Also: Ambati Rambabu: ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదు.. ప్రజల మెప్పు పొందాలి
Also Read
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
- Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారులను పిల్చుకొని బడ్జెట్ రాసి ఇచ్చుడు తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైన చర్చ బడ్జెట్ మీద డిపార్ట్మెంట్ల వారిగా జరిగే పరిస్థితి లేదు. రాచరికం లాగా వ్యవహరిస్తున్నారు తప్ప డిపార్ట్మెంట్ వారిగా నిధులు ఇవ్వటం లేదు.కేంద్ర ప్రభుత్వం తన సంప్రదాయాల ప్రకారం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను పిలిస్తే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి డుమ్మా కొట్టారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, విశ్వాసం లేదు అనటానికి ఇది సజీవ సాక్ష్యం అన్నారు.
కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నారు..మాకు వచ్చే ఎఫ్ఆర్బియం రుణాల్లో 15 వేల కోట్ల రూపాయలు కోత పెట్టారని.. మనకు వచ్చే గ్యారెంటీ రుణాలలో కోత పెట్టారు అని మొత్తం.. 40 వేల కోట్ల రూపాయల రుణాలు రాకుండా చేస్తున్నారని చెప్తున్నారు.కానీ ఇవి అన్ని రుణాలు.. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద లేదా గ్రాంట్ కింద వచ్చే డబ్బు కాదు… ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అప్పు. ఇప్పటికే పరిధి దాటిపోయారు.
అప్పుల కుంపటిగా మారిపోయారు, అని తెలుసుకొని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రుణం నిలిపివేస్తే అది కేంద్ర ప్రభుత్వం మీద నేడుతున్నారు. గణాంకాల శాఖ దేశంలో ధరల పెరుగుదల మీద సర్వే చేస్తే మన రాష్ట్రంలో 8.75% ద్రవ్యోల్బణం పెరిగింది అని రిపోర్ట్ ఇచ్చారు. దేశంలో నెంబర్ వన్ తెలంగాణ అని చెప్పే ముఖ్యమంత్రి గారు ధరల పెరుగుదలలో, ప్రజలనడ్డి విరవడంలో నెంబర్ వన్ తెలంగాణ వచ్చింది అంటే సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ అప్పుల కుంపటిలా మారిందని మండిపడ్డారు.
Read Also: Orange Movie: కల్ట్ క్లాసిక్ ‘ఆరెంజ్’ .. ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా..?
తాజావార్తలు
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
-
Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
-
Vastu Tips: మీ డైనింగ్ టేబుల్పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!