Vivek Venkatswamy: రేపు మునుగోడుకు భూపేంద్ర యాదవ్.. ఎల్లుండి రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Venkatswamy: బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు, అసెంబ్లీ ఇంఛార్జి ల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర సహ ఇంచార్జ్ అరవింద్ మీనన్ హాజరయ్యారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక, పార్లమెంట్ ప్రవాస యోజన, బైక్ ర్యాలీ లు ఇతర అంశాలపై చర్చించనున్నారు. రేపు మునుగోడులో బీజేపీ పోలింగ్ బూత్ ఇంఛార్జీలతో తరుణ్ చుగ్ భేటీ కానున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ , వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎల్లుండి మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి కంపెనీలపైన కేటీఆర్ ఆరోపణలు సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఎక్కువ ధరకు ప్రాజెక్టులు కట్టబెట్టిందని అన్నారు.
ఎక్కువ ధరలకు కేటాయించడం వల్ల 29 వేల కోట్లు జెన్ కో, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 4 కాంట్రాక్టులు రాజ్ గోపాల్ రెడ్డికి దక్కాయని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం వల్ల రాలేదు.. కేటీఆర్ గ్రహించాలని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలపై విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ మునుగోడులో గెలుస్తుందనే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ పై రాజ్ గోపాల్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తానన్నారు అని తెలిపారు. TRS ఓడిపోతుందనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి 86 మందిని బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారని అన్నారు. సోమవారం నామినేషన్ దాఖలు కోసం రిటర్నింగ్ అధికారిని సమయం ఆడిగామని, సోమవారం రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారని అన్నారు. ర్యాలీ, సభ ఉంటుందని, బండి సంజయ్, తరుణ్ చుగ్ హాజరు అవుతారని అన్నారు. రేపు మునుగోడు కు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వస్తున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ , వివేక్ వెంకటస్వామి తెలిపారు.
Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!