Vishnu Vardhan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ డ్రామా..! ఇది పీకే కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. అయితే, ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్.. బీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపై సీబీఐ విచారణకు కోరడం లేదు అని ప్రశ్నించారు.. అయితే, ఈ డీల్ డ్రామా వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్రెడ్డి..
Read Also: TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు వాళ్లే… బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎవరు లేరని తేల్చాశారు విష్ణువర్ధన్రెడ్డి.. నలుగురు ఎమ్మెల్యేలను కొంటె తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా…? అని ప్రశ్నించిన ఆయన.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.. ఇక, వంద కోట్లు నగదు దొరికిందంటున్నారు… మరి మీడియా ముందు ఎందుకు చూపలేదు..? అని నిలదీశారు విష్ణువర్ధన్రెడ్డి.. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వెలుగు చూసిన తర్వాత హైదరాబాద్ శివారులోని ఆ ఫామ్ హౌస్ నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్కు చేరుకున్నారు.. ఆ వెంటనే హరీష్రావు కూడా ప్రగతిభవన్కు రాగా.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు.. నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాత్రి ప్రగతిభవన్లోనే బస చేయగా.. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడతారని ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!