Vishnu Vardhan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ డ్రామా..! ఇది పీకే కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. అయితే, ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్.. బీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపై సీబీఐ విచారణకు కోరడం లేదు అని ప్రశ్నించారు.. అయితే, ఈ డీల్ డ్రామా వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్రెడ్డి..
Read Also: TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు వాళ్లే… బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎవరు లేరని తేల్చాశారు విష్ణువర్ధన్రెడ్డి.. నలుగురు ఎమ్మెల్యేలను కొంటె తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా…? అని ప్రశ్నించిన ఆయన.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.. ఇక, వంద కోట్లు నగదు దొరికిందంటున్నారు… మరి మీడియా ముందు ఎందుకు చూపలేదు..? అని నిలదీశారు విష్ణువర్ధన్రెడ్డి.. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వెలుగు చూసిన తర్వాత హైదరాబాద్ శివారులోని ఆ ఫామ్ హౌస్ నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్కు చేరుకున్నారు.. ఆ వెంటనే హరీష్రావు కూడా ప్రగతిభవన్కు రాగా.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు.. నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాత్రి ప్రగతిభవన్లోనే బస చేయగా.. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడతారని ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!