Vishnu Vardhan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ డ్రామా..! ఇది పీకే కుట్ర..
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. అయితే, ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్.. బీఆర్ఎస్ డ్రామా అంటూ కొట్టిపారేశారు.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపై సీబీఐ విచారణకు కోరడం లేదు అని ప్రశ్నించారు.. అయితే, ఈ డీల్ డ్రామా వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్రెడ్డి..
Read Also: TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
Also Read
ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు వాళ్లే… బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎవరు లేరని తేల్చాశారు విష్ణువర్ధన్రెడ్డి.. నలుగురు ఎమ్మెల్యేలను కొంటె తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా…? అని ప్రశ్నించిన ఆయన.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.. ఇక, వంద కోట్లు నగదు దొరికిందంటున్నారు… మరి మీడియా ముందు ఎందుకు చూపలేదు..? అని నిలదీశారు విష్ణువర్ధన్రెడ్డి.. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వెలుగు చూసిన తర్వాత హైదరాబాద్ శివారులోని ఆ ఫామ్ హౌస్ నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్కు చేరుకున్నారు.. ఆ వెంటనే హరీష్రావు కూడా ప్రగతిభవన్కు రాగా.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు.. నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాత్రి ప్రగతిభవన్లోనే బస చేయగా.. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడతారని ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!