Pallapu Govardhan: బీజేపీకి షాక్… నేడు కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్న పల్లపు గోవర్దన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallapu Govardhan: బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ చిక్కుల్లో పడింది. తెలంగాణ బీజేపీలో మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతోనే సమస్య మొదలైంది. ఆయన ఉద్వాసన తర్వాత మొదలైన రాజీనామాల పర్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కొనసాగుతోంది. బీజేపీ గెలుపుపై నమ్మకం లేక కొందరు పార్టీని వీడుతుండగా.. మరికొందరు టికెట్ రాకపోవడంతో పార్టీని వీడుతున్నారు…మరికొందరు పార్టీలు వారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మరో కీలక నేత బీజేపీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ బీజేపీకి రాజీనామా చేశారు. వెంటనే మంత్రులు కేటీఆర్ , హరీశ్ రావు ఆయనను బీఆర్ ఎస్ కు ఆహ్వానించారు. దీంతో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గోవర్ధన్ బీఆర్ఎస్లో చేరనున్నారు. వడ్డెర సామాజికవర్గానికి చెందిన గోవర్ధన్ రాజీనామా హైదరాబాద్ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇదిలావుంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో పల్లపు గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయతీ, నిస్వార్థంతో పార్టీ కోసం కష్టపడే తనలాంటి నేతలకు బీజేపీలో స్థానం లేదని అర్థమైంది. హిందుత్వం కోసం వెతుకుతున్న తనలాంటి యువకులకు బీజేపీ అండగా ఉంటుందన్న నమ్మకం ఉందని గోవర్ధన్ అన్నారు.
Also Read
- Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
బీజేపీలో భవిష్యత్తు ఉండదని తనలాంటి యువత, బీసీ నేతలు ఇటీవలే గ్రహించారని పల్లపు ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తానని ప్రకటించారని… కానీ ఎన్నికల్లో గెలిచే దమ్ము, సత్తా ఉన్న తనలాంటి యువ నేతలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. టిక్కెట్లు ఇవ్వకుంటే కనీసం పిలిచి మాట్లాడే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. అందుకే ఇక ఆత్మగౌరవం దిగజారలేననే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. 22 ఏళ్లుగా తల్లిలా ప్రేమించిన బీజేపీని వీడడం బాధాకరమని గోవర్ధన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీని వీడిన గోవర్ధన్ నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ భవన్లో ఆయన చేరిక కార్యక్రమం జరగనుంది. తన అనుచరులతో పాటు మరికొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పల్లపు గోవర్ధన్ భారీ ర్యాలీగా తెలంగాణ భవన్కు చేరుకుని బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!