BJP National Executive Meeting: ఎన్టీఆర్ రియల్ హీరో, ఆయన దేవుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ సీనియర్ నేత, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్దేవ్… జాతీయ కార్యకవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన ఆయన.. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని సూచించారు.. ఎనిమిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.. ఇక, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు.. టీడీపీని స్థాపించిన అనతి కాలంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృస్టించారని పేర్కొన్న ఆయన.. ఎన్టీఆర్ అసలైన హీరో, ఆయన దేవుడంటూ వ్యాఖ్యానించారు బిప్లవ్దేవ్.. అప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని స్థాయి నుంచి ప్రజాబలంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి చరిత్ర సృష్టించారని తెలిపారు.
Read Also: Puri Rath Yatra 2022: నేటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్ర
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
మరోవైపు, తమ రాష్రంటోని రాజకీయాలపై స్పందించారు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్.. త్రిపురలో కూడా కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలుకొట్టి భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించిందన్న ఆయన.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన నేతలు.. ఇప్పటికే జిల్లాల్లో అడుగుపెట్టారు.. తెలంగాణను చుట్టేస్తున్నారు.. ఏ జిల్లాను వదలకుండా పర్యటిస్తున్నారు.. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. నియోజకవర్గ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, మోర్చాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.. పదాధికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పుర ప్రముఖులు, వ్యాపారులతో భేటీ అవుతూ.. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే పనిలో పడిపోయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!