Harish Rao: బీజేపీ హటావో.. సింగరేణి బచావో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ హటావో సింగరేణి బచావో నినాదంతో బి.ఆర్.ఎస్ కార్యకర్తలు పని చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఛాన్స్ లేదని బీజేపీలో ఎవరైనా చేరితే అది ఆత్మహత్య సదృశ్యం మాత్రమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీలోకి ఎవరైనా వెళ్తారంటే వారు రాజకీయాలకు దూరమైతారని ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఎటువంటి అవకాశాలు ఇక్కడి ప్రజలు ఇవ్వరని హరీష్ రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి అమ్మేందుకు అనేక కుట్రలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే దానిలో నిజాలు లేవని పార్లమెంట్లో కేంద్రమంత్రి చేసిన ప్రకటన స్పష్టం అవుతుందని హరీష్ రావు అన్నారు. సింగరేణి అప్పుల ఊబిలో తీసుకెళ్లి అమ్మేస్తుందని అన్నారు. అప్పుల ఊబిలోకి నెట్టి దానిని ఆదానికి అమ్మేస్తుందని హరీష్ రావు ఆరోపించారు.
Read also: Anand Mahindra: నాటు నాటు అంత ఎనర్జీలేదు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
దేశంలోనే బీజేపీ హటావో నినాదంతో మనం ముందుకు వెళ్లాలని బీజేపీని హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీకి వెళ్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇల్లందులో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పండుగలు పబ్బాలని వదిలేసి 18న జరిగే భారీ బహిరంగ సభకి హాజరుకావాలని అన్నారు. మనము అడగని అభివృద్ధి పథకాలను కూడా కేసీఆర్ మనకు కల్పిస్తున్నారు. ఏ సమస్య ఉన్న అది పరిష్కారం చేస్తారు అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ప్రజలు ఎలా పనిచేశారో, వారి గురించి ఎలా చెప్పకుంటామో అన్న విధంగా బీఆర్ఎస్ సభ గురించి మన పనితనం ఆ విధంగా ఉండాలని తుమ్మల నాగేశ్వర అన్నారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రేగా కాంతారావులు పాల్గొన్నారు.
China Manja: నాగోల్ చిన్నారి మాంజా ఘటన.. చైతన్యపురి సీఐ సీరియస్ వార్నింగ్
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?