Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో షెజికి మజీద్ వద్ద కొందరు వ్యక్తులు బైక్ రేసింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు రేసర్లను అడ్డుకున్నాడు. రోడ్లపై బైక్ రేసింగ్ ఏమిటి? అంటూ.. ఇక్కడ బైక్ రేసింగ్ చేయొద్దని హెచ్చరించారు. బైక్ రేసింగ్ల వల్ల వాహనదారులతో పాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయవద్దని పోకిరీలకు సూచించారు. అవసరమైతే ఖాళీ ప్రదేశాల్లో వెళ్లి బైక్ రేసింగ్ చేయాని, ఇలా పబ్లిక్ గా రోడ్లపై బైక్రేసింగ్ ఎలా చేస్తారు? అని రేసర్లను అడిగాడు. దీంతో బైక్ రేసర్లకు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడిపై పోకిరీలు విరుచుకుపడ్డారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
Read also: Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు
వారంతా యువకుడిపై కత్తులతో దాడి చేసి రణరంగం సృష్టించారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రోడ్లపై బైక్ స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
జాతీయ రహదారులపై వాహనాల అతివేగానికి అడ్డుకట్ట వేసి స్పీడ్ గన్ లు ఏర్పాటు చేసి ఏటా కోట్లాది రూపాయల జరిమానాలు వసూలు చేస్తున్న పోలీసులు వాహనాలు నడిపే కొందరు పోకిరీలపై చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో కొందరు విద్యార్థులు, యువకులు పోటీపడి రోడ్లపై విన్యాసాలు చేస్తూ పాదచారులు, ఇతర వాహనాలు భయాందోళనకు గురిచేస్తున్నారని పలువురు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు నగర శివారులో చోటుచేసుకుని కొందరు విద్యార్థులు, యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై వేగంగా వెళుతుండగా సడన్ బ్రేక్ వేస్తే పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంబడి, బస్టాండ్ల చుట్టూ పోకిరీలు తమ ప్రతాపం చూపుతున్నారు. పోకిరీల బైక్ స్టంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!