Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ.70 కోట్లతో అభివృద్ధి
- రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల కోసం రూ.2,216 కోట్లు ఖర్చు: భట్టి
- గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.802 కోట్ల నిధుల మంజూరు
- రైతుల కోసం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.74 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : కేవలం దైవభక్తి కోసమే కాకుండా, సమాజంలో మార్పు కోసం విద్యకు , రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రసిద్ధ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారంతా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఉన్నతమైన మార్పులు తీసుకురావచ్చని తాము గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన పిప్పిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గూడెం ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మాట ఇచ్చిన కేవలం 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి, ఈ రోజు భూమి పూజ చేసుకోవడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రూ. 70 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2,216 కోట్లతో వివిధ దేవాలయాలను అభివృద్ధి చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇటీవల సరస్వతీ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించామని, అలాగే రాబోయే గోదావరి పుష్కరాల కోసం కూడా రూ. 802 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒకవైపు దైవభక్తి కోసం నిధులు ఇస్తూనే, మరోవైపు అన్నదాతలను ఆదుకునేందుకు రూ. 74 కోట్ల వ్యయంతో ‘గూడెం లిఫ్ట్ ఇరిగేషన్’ పనులను కూడా చేపడుతున్నామని, దీనివల్ల స్థానిక రైతులకు సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!