Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ.70 కోట్లతో అభివృద్ధి
- రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల కోసం రూ.2,216 కోట్లు ఖర్చు: భట్టి
- గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.802 కోట్ల నిధుల మంజూరు
- రైతుల కోసం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.74 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : కేవలం దైవభక్తి కోసమే కాకుండా, సమాజంలో మార్పు కోసం విద్యకు , రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రసిద్ధ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారంతా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఉన్నతమైన మార్పులు తీసుకురావచ్చని తాము గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన పిప్పిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గూడెం ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మాట ఇచ్చిన కేవలం 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి, ఈ రోజు భూమి పూజ చేసుకోవడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రూ. 70 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2,216 కోట్లతో వివిధ దేవాలయాలను అభివృద్ధి చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇటీవల సరస్వతీ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించామని, అలాగే రాబోయే గోదావరి పుష్కరాల కోసం కూడా రూ. 802 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒకవైపు దైవభక్తి కోసం నిధులు ఇస్తూనే, మరోవైపు అన్నదాతలను ఆదుకునేందుకు రూ. 74 కోట్ల వ్యయంతో ‘గూడెం లిఫ్ట్ ఇరిగేషన్’ పనులను కూడా చేపడుతున్నామని, దీనివల్ల స్థానిక రైతులకు సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!