Bhatti vikramarka: 74వ రోజుకు చేరిన పీపుల్స్ మార్చ్.. మధ్యాహ్నం మీడియా ముందుకు భట్టి, మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర 74వ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగనుంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రం నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. తాడూరు, గగ్గలపల్లి, మంతటి క్రాస్ రోడ్, దేశిట్క్యాల్ గ్రామాల వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంతటి క్రాస్ రోడ్ వద్ద సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మీడియాతో మాట్లాడుతారు. ఈరోజు మధ్యాహ్నం మంతటి క్రాస్ రోడ్ వద్ద లంచ్ బ్రేక్ ఉంటుందని తెలిపారు. దేశిట్క్యాల గ్రామంలో ఈరోజు రాత్రికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం బస చేస్తారు.
నిన్న నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ వద్ద 73వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్లో ముంపునకు గురైన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్లోని అంకన్పల్లితండా, కారుకొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా, అంకన్పల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయన్నారు. ఇక్కడ నివసించే వారందరూ 100% దళితులు మరియు గిరిజనులు. ప్రభుత్వం తమ బాధ్యతను మరిచి మానవత్వంతో వ్యవహరిస్తూ భూమికి భూమి, ఇంటింటికి, ఉద్యోగం కల్పిస్తోందని విమర్శించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం హామీపై నిర్వాసితులంతా సంతకాలు చేశారని, ఇప్పుడు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దీంతో ఊరు, భూమి, ఇల్లు, ఉపాధి కోల్పోయి నిర్వాసితులకు దిక్కులేకుండా పోయింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు భూమి, ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
IMD Hyderabad: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఐఎండి వెల్లడి
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!