Bhatti vikramarka: 74వ రోజుకు చేరిన పీపుల్స్ మార్చ్.. మధ్యాహ్నం మీడియా ముందుకు భట్టి, మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర 74వ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగనుంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రం నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. తాడూరు, గగ్గలపల్లి, మంతటి క్రాస్ రోడ్, దేశిట్క్యాల్ గ్రామాల వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంతటి క్రాస్ రోడ్ వద్ద సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మీడియాతో మాట్లాడుతారు. ఈరోజు మధ్యాహ్నం మంతటి క్రాస్ రోడ్ వద్ద లంచ్ బ్రేక్ ఉంటుందని తెలిపారు. దేశిట్క్యాల గ్రామంలో ఈరోజు రాత్రికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం బస చేస్తారు.
నిన్న నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ వద్ద 73వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్లో ముంపునకు గురైన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్లోని అంకన్పల్లితండా, కారుకొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా, అంకన్పల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయన్నారు. ఇక్కడ నివసించే వారందరూ 100% దళితులు మరియు గిరిజనులు. ప్రభుత్వం తమ బాధ్యతను మరిచి మానవత్వంతో వ్యవహరిస్తూ భూమికి భూమి, ఇంటింటికి, ఉద్యోగం కల్పిస్తోందని విమర్శించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం హామీపై నిర్వాసితులంతా సంతకాలు చేశారని, ఇప్పుడు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దీంతో ఊరు, భూమి, ఇల్లు, ఉపాధి కోల్పోయి నిర్వాసితులకు దిక్కులేకుండా పోయింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు భూమి, ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
IMD Hyderabad: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఐఎండి వెల్లడి
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..