Bhatti Vikramarka Padayatra: ఇది అడ్డగోలు జీవోల ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్స్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతూ వారి బాగోగులు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు జీవోలను సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసిఆర్ వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ నకిలీ విత్తనాలు బాగా మార్కెట్ లోకి వస్తే కేసీఆర్ ఏం చేశాడని భట్టి అన్నారు.
గతంలో రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు ఇవ్వలేదు. ఎరువుల ధరలను ప్రభుత్వం విపరీతంగా పెంచడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కు 1500 కోట్ల ఇస్తే. వేలాది ఎకరాలకు సాగు నీరు అందేది కానీ ఈ ప్రభుత్వం సీతా రామ ప్రాజెక్ట్ పేరుతో 25 వేల కోట్లు వెచ్చించినప్పటికీ ఇంతవరకు చుక్క నీరు లేదు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయకు లెక్క చెప్పాలని అన్నారు. ప్రాజెక్ట్ ల డీపీఆర్ ఎందుకు బయట పెట్టడం లేదని భట్టి ప్రశ్నించారు. ముదిగొండ మండలం భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతోంది.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో పూర్తి చేసి సీఎల్పీ నాయకుడిగా రాష్ట్రంలోని అన్ని మండలాలు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో అది నెరవేరలేదు. అది కొద్ది మందికే ఉపయోగపడుతుంది. తెలంగాణలో సృష్టించే సంపద ఏమై పోతుంది…? ఈ పాలన మారాలి సంపద ఇక్కడి ప్రజలకు చెందాలి. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిసిన వ్యక్తిగా ఇక్కడి సంపద ప్రజలకు అందే వరకు పోరాటం సాగిస్తా. గోకినేపల్లి సమీపంలోని మామిడి తోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్శీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!