Bhatti Vikramarka Padayatra: ఇది అడ్డగోలు జీవోల ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్స్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతూ వారి బాగోగులు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు జీవోలను సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసిఆర్ వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ నకిలీ విత్తనాలు బాగా మార్కెట్ లోకి వస్తే కేసీఆర్ ఏం చేశాడని భట్టి అన్నారు.
గతంలో రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు ఇవ్వలేదు. ఎరువుల ధరలను ప్రభుత్వం విపరీతంగా పెంచడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కు 1500 కోట్ల ఇస్తే. వేలాది ఎకరాలకు సాగు నీరు అందేది కానీ ఈ ప్రభుత్వం సీతా రామ ప్రాజెక్ట్ పేరుతో 25 వేల కోట్లు వెచ్చించినప్పటికీ ఇంతవరకు చుక్క నీరు లేదు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయకు లెక్క చెప్పాలని అన్నారు. ప్రాజెక్ట్ ల డీపీఆర్ ఎందుకు బయట పెట్టడం లేదని భట్టి ప్రశ్నించారు. ముదిగొండ మండలం భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతోంది.
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో పూర్తి చేసి సీఎల్పీ నాయకుడిగా రాష్ట్రంలోని అన్ని మండలాలు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో అది నెరవేరలేదు. అది కొద్ది మందికే ఉపయోగపడుతుంది. తెలంగాణలో సృష్టించే సంపద ఏమై పోతుంది…? ఈ పాలన మారాలి సంపద ఇక్కడి ప్రజలకు చెందాలి. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిసిన వ్యక్తిగా ఇక్కడి సంపద ప్రజలకు అందే వరకు పోరాటం సాగిస్తా. గోకినేపల్లి సమీపంలోని మామిడి తోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్శీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!