Breaking: డీసీపీపై భట్టి ఫైర్.. నన్నే తోస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ భవన్ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్యం తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్న భట్టి విక్రమార్క ను డిసీపీ జోయల్ డెవిస్ ముందుకు తోయడంతో.. ఉద్రికత్త నెలకొంది. దీంతో.. భట్టి కి పోలీసులకు వాగివ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్ననన్నే తోస్తావా అంటూ డిసీపీ జోయల్ పై ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు తోస్తున్నావంటూ మండిపడ్డారు. మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారంటూ నిలదీసారు.
శాంతియుతంగా మేము నిరసన తెలుసుతుంటే మమ్మల్ని అదుపులో తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం పై భట్టి తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నారని మండి పడ్డారు. దేశం సర్వనాశనం అవుతోందని నిప్పులు చెరిగారు భట్టి. తనని ఎందుకు తోసారంటూ మండి పడ్డారు. మాపై మీ జులుం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తోస్తావా అంటూ పోలీసులకు ప్రశ్నించారు.
Also Read
కాగా.. మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఏంటని నిప్పులు చెరిగారు రేణుకా చౌదరి. ఆమెను పోలీసులు చుట్టుమట్టడంతో ఆమె ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేసేందుకు యత్నించిన ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి. మహిళలను మహిళా పోలీసులు అరెస్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.దీంతో పోలీసులకు రేణుకా చౌదరి మధ్య తోపులాట, వాగివ్వాదం చోటు చేసుకుంది. జీపు ఎక్కను అంటూ ఆమె ససేమిరా అనడంతో.. పోలీసులు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కించారు.
కాంగ్రెస్ ను ఎవరు అడ్డుకోలేరని హెచ్చరించారు. రాజ్ భవన్ ప్రాంతమంతా కాంగ్రెస్ నేతలతో అట్టుడుకింది. దీంతో .. రాజ్భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్కుమార్, రేణుకాచౌదరి లను అరెస్ట్ చేశారు. రేణుకా చౌదరి ని అరెస్ట్ చేసేందుకు యత్నించిన ఎస్సై చొక్కా పట్టుకుకోవడంతో.. ఉదృక్తత వాతావరణం నెలకొంది.
హైద్రాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ముట్టడికి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. మోదీ కొ హటావ్ దేశ్ కొ బచావ్ అనే నినాదాలతో రాజ్ భవన్ అట్టుడికింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
Chidambaram: ఎంపీలను అర్థరాత్రి వరకు పీఎస్లలో ఉంచి వేధించారు..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!