KTR for Basara IIIT: నేడు బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్.. మళ్లీ ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara Triple IT Minister KTR today: నేడు ఆర్జీయూకేటీలో జరిగే 5వ స్నాతకోత్సవానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరవుతారని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.వి. వెంకటరమణ అన్నారు. స్నాతకోత్సవ వేడుకల్లో 2013 నుండి 2016 వరకు సుమారు 576 మంది పూర్వ విద్యార్థులు సర్టిఫికేట్లను అందుకుంటారు. స్నాతకోత్సవంలో పూర్వ విద్యార్థులకు 36 బంగారు పతకాలు, 2 డోనర్ పతకాలను మంత్రులు ప్రదానం చేస్తారు.
ఈ వేడుకకు టీసీఎస్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్న ప్రత్యేక అతిథిగా హాజరవుతారని వివరించారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకు 12వ తేదీ నుంచి 2200 ల్యాప్టాప్లు, 100 డెస్క్టాప్లు, యూనిఫారాలు, షూలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్నింటిని మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో RGUKTని పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఆడిటోరియంలో కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 11:45 గంటలకు పూర్తవుతుందని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ కుమార్, వినరోద్, పావని, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read also: Dr Vaishali Kidnap Case: ఎగ్జామ్స్ సెంటర్ కు కిడ్నాప్ కు గురైన వైశాలి.. అక్కడ భారీ భద్రత
ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. జూన్లో ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ ఇక్కడికి వస్తే తప్పకుండా కేటీఆర్ ను తీసుకువస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు..ఆ హామీ మేరకు కేటీఆర్ తో పాటు సబితా ఇంద్రారెడ్డి ఆర్ టీయూకేటీకి వెళ్లారు. మళ్లీ ముగ్గురు మంత్రులు ట్రిపుల్ ఐటీకి వెళ్లడం రసాభాసగా మారింది. అయితే మంత్రి కేటీఆర్తో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరిస్తారా? లేక కేటీఆర్ తో ఆనందంగా గడుపుతున్నారా? అనే అంశంపై సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
Bihar court: సహారా అధినేత సుబ్రతా రాయ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!