Bandi Sanjay: మునుగోడులో కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Warns CM KCR And Says Every Answer Will Be Given: శనివారం మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆ సభలో కేసీఆర్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్తామన్నారు. అక్కడితో తాము ఆగేది లేదన్న బండి సంజయ్.. మునుగోడు సభలోలోనే కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతామన్నారు. కేసీఆర్కు ప్రస్తుతం మునుగోడు భయం పట్టుకుందని, ఆ భయంతోనే మునుగోడు సభలో ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
కాగా.. మునుగోడులో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సాంబమూర్తి నగర్లోని సత్యనారాయణ అనే కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం వెళ్లిన అమిత్ షా.. అక్కడ రైతు సంఘాలతో భేటీ అయ్యారు. వారితో సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన.. ఫసల్ బీమా పథకం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రభుత్వాన్ని మారిస్తేనే, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరోవైపు.. కాంగ్రెస్కు రాజీనామా చేసిన కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ సభలోనే అమిత్ షా సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
తాజావార్తలు
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
-
Bathroom Cleaning Tips: మీ బాత్రూమ్ గార పట్టిందా? ఇలా చేస్తే పది నిమిషాల్లో కొత్తదానిలా మార్చేయొచ్చు!
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో