Bandi Sanjay: సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ బహిరంగలేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వడ్ల కొనుగోలు, కాంటాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి బహిరంగలేఖ రాశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ తెలంగాణ శాఖ చేసిన అనేక ఉద్యమాలకు తలవొగ్గే మీరు వడ్లు కొనడానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతీ వడ్ల గింజ కొంటామని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మీరు ఆర్భాటంగా ప్రకటించి 15 రోజులు కావస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే మీ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని స్పష్టం అవుతోంది. ఇప్పటికైనా మీరు కళ్లకు కట్టుకున్న గంతలు తీసేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేయాలని బీజేపీ తెలంగాణ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న నాకు అనేక మంది రైతులు వచ్చి కొనుగోళ్ళ కేంద్రాలు ప్రారంభించలేదని, దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల్ లో 71 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం రెండు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తిలో 225 కేంద్రాలకు 19 కేంద్రాలు, నారాయణపేట్లో 91 కేంద్రాలకు 70 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంటా పెడుతున్నది మాత్రం నామామాత్రం. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు.
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
రాష్ట్రప్రభుత్వం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి వుండగా కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నది. దీన్ని బట్టే రాష్ట్రప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించటమే కాకుండా ప్రతీ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కాంటా ఏర్పాటుచేసి ప్రతీ ఒక్క గింజ కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్రశాఖ తరుపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కాంటాలు ఏర్పాటు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులు వడ్లను తీసుకొని కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వాటిని కొనుగోలు చేయకపోవడంవల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను, కాంటాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలని రైతులకు అవసరమైనంత గోనుసంచులను సేకరించాలని, రైతుల నుంచి సేకరించిన వడ్లకు వెంటనే చెల్లింపులు చేయాలని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్రప్రభుత్వమే చెల్లిస్తున్నందున రాష్ట్రప్రభుత్వం ఎటువంటి అలసత్వాన్ని చూపించకుండా ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిదికన చర్యలు చేపట్టాలి.
రాష్ట్రప్రభుత్వం సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి కేంద్రప్రభుత్వానికి ఇస్తే పూర్తిగా తీసుకోవడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్న ప్రతీ ఒక్క వడ్ల గింజను కొనుగోలు చేయాలని రైతులపక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం ప్రతీ గింజ కొనేవరకు, వారికి చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించే వరకు రైతులు పక్షాన బీజేపీ శాఖ తెలంగాణ శాఖ పోరాడుతుందన్నారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..