K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
BJP MP K Laxman Sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ను పక్కనపెట్టారని.. కాగితాలపై అంకెల గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో విదేశాలు తిరుగుతూ.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? అని ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు విలువైన భూములను అప్పనంగా కట్టపెడుతున్నారని.. భూముల కేటాయింపులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
Tamil Nadu: మతాంతర సంబంధంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..
Also Read
తెలంగాణలో మేధస్సు ఉన్న అధికారులు లేరా? అని నిలదీసిన కే లక్ష్మణ్.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని సలహాదారులుగా నియమించుకున్నారని విరుచుకుపడ్డారు. యూనివర్సిటీల్లో నియామకాలు లేవని, పోస్టులు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. బిస్వల్ కమిటీ చెప్పినట్లు.. లక్ష 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి జీఓలపై గోప్యత ఎందుకు? అని ప్రశ్నించారు. 5 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ ఇంటర్నెట్ ఏమైందని అడిగారు. బతుకమ్మ చీరలను గుజరాత్ నుంచి తీసుకురాకుండా.. ఇక్కడ చనేత కార్మికులకు పని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరిపించడం లేదన్నారు. ప్రధాని మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించారని గుర్తు చేశారు. సింగరేణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని, 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాాట ఉన్న సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుందని అడిగారు.
Nagam Janardhan Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. నాగం జనార్ధన్ డిమాండ్
మోడీ తెరిచిన రామగుండం కంపెనీలో బీఆర్ఎస్ నేతలు ఉద్యోగాలు అమ్ముకున్నారని కే లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ.4,446 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పాతబస్తీలో ఎందుకు మెట్రో రైలు సదుపాయం కల్పించడం లేదని అడిగారు. ఐటీ సెక్టార్కు కేటాయించిన భూములు.. కల్పించిన ఉద్యోగాలు సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కుటుంబ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ ఇంజన్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!