K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman Sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ను పక్కనపెట్టారని.. కాగితాలపై అంకెల గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో విదేశాలు తిరుగుతూ.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? అని ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు విలువైన భూములను అప్పనంగా కట్టపెడుతున్నారని.. భూముల కేటాయింపులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
Tamil Nadu: మతాంతర సంబంధంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
తెలంగాణలో మేధస్సు ఉన్న అధికారులు లేరా? అని నిలదీసిన కే లక్ష్మణ్.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని సలహాదారులుగా నియమించుకున్నారని విరుచుకుపడ్డారు. యూనివర్సిటీల్లో నియామకాలు లేవని, పోస్టులు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. బిస్వల్ కమిటీ చెప్పినట్లు.. లక్ష 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి జీఓలపై గోప్యత ఎందుకు? అని ప్రశ్నించారు. 5 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ ఇంటర్నెట్ ఏమైందని అడిగారు. బతుకమ్మ చీరలను గుజరాత్ నుంచి తీసుకురాకుండా.. ఇక్కడ చనేత కార్మికులకు పని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరిపించడం లేదన్నారు. ప్రధాని మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించారని గుర్తు చేశారు. సింగరేణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని, 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాాట ఉన్న సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుందని అడిగారు.
Nagam Janardhan Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. నాగం జనార్ధన్ డిమాండ్
మోడీ తెరిచిన రామగుండం కంపెనీలో బీఆర్ఎస్ నేతలు ఉద్యోగాలు అమ్ముకున్నారని కే లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ.4,446 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పాతబస్తీలో ఎందుకు మెట్రో రైలు సదుపాయం కల్పించడం లేదని అడిగారు. ఐటీ సెక్టార్కు కేటాయించిన భూములు.. కల్పించిన ఉద్యోగాలు సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కుటుంబ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ ఇంజన్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..