K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman Sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ను పక్కనపెట్టారని.. కాగితాలపై అంకెల గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో విదేశాలు తిరుగుతూ.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? అని ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు విలువైన భూములను అప్పనంగా కట్టపెడుతున్నారని.. భూముల కేటాయింపులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
Tamil Nadu: మతాంతర సంబంధంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..
Also Read
తెలంగాణలో మేధస్సు ఉన్న అధికారులు లేరా? అని నిలదీసిన కే లక్ష్మణ్.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని సలహాదారులుగా నియమించుకున్నారని విరుచుకుపడ్డారు. యూనివర్సిటీల్లో నియామకాలు లేవని, పోస్టులు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. బిస్వల్ కమిటీ చెప్పినట్లు.. లక్ష 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి జీఓలపై గోప్యత ఎందుకు? అని ప్రశ్నించారు. 5 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ ఇంటర్నెట్ ఏమైందని అడిగారు. బతుకమ్మ చీరలను గుజరాత్ నుంచి తీసుకురాకుండా.. ఇక్కడ చనేత కార్మికులకు పని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరిపించడం లేదన్నారు. ప్రధాని మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించారని గుర్తు చేశారు. సింగరేణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని, 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాాట ఉన్న సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుందని అడిగారు.
Nagam Janardhan Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. నాగం జనార్ధన్ డిమాండ్
మోడీ తెరిచిన రామగుండం కంపెనీలో బీఆర్ఎస్ నేతలు ఉద్యోగాలు అమ్ముకున్నారని కే లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ.4,446 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పాతబస్తీలో ఎందుకు మెట్రో రైలు సదుపాయం కల్పించడం లేదని అడిగారు. ఐటీ సెక్టార్కు కేటాయించిన భూములు.. కల్పించిన ఉద్యోగాలు సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కుటుంబ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ ఇంజన్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు… అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!