Bandi Sanjay : కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
- కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేయనున్నాం
- ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ ఆధిక్యత
- అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగా.. పార్టీ సహాయం అందుబాటులో
- గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం.. కేంద్ర నిధుల ప్రాధాన్యం
Bandi Sanjay : స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి బీజేపీ ఖాతాలో చేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు జరగాలని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని సంజయ్ తెలిపారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధులేమీ లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా మంది అప్పులు తీరచేయలేక ఊళ్లను వదిలి నగరాలకు వలస వెళ్ళారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తెచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రజలంతా కసరత్తు చేస్తున్నారు” అని అన్నారు.
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, తాజా మాజీ సర్పంచులు, ఉద్యోగులే ఈసారి బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. “కాంగ్రెస్ పాలనలో ఈ వర్గాలందరికీ అన్యాయం జరిగింది. హామీలు ఇచ్చి ఒక్కటినీ అమలు చేయలేదు. మహిళలకు నెలనెలా 2500 రూపాయలు, వృద్ధులకు పెన్షన్ పెంపు, రైతులకు రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు భరోసా కార్డులు – అన్నీ మోసమే అయ్యాయి. ఈసారి ఈ వర్గాలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పబోతున్నారు” అని మండిపడ్డారు.
అభ్యర్థుల టిక్కెట్ల విషయంలో బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రాష్ట్ర నాయకత్వం సర్వేలు నిర్వహిస్తోందని సంజయ్ తెలిపారు. “గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తాం. టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దు. పార్టీ పదవుల రూపంలో గౌరవం, సహాయం అందిస్తాం. కానీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం” అని హెచ్చరించారు.
గ్రామాల్లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని సంజయ్ గుర్తుచేశారు. “ఉపాధి హామీ పనులు, ప్రధాని సడక్ యోజన, సీఐఆర్ఎఫ్ నిధులతో రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, బోర్లు – ఇవన్నీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లే సాధ్యమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాలేదు. బీఆర్ఎస్ గెలిచినా పరిస్థితి మారదు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక నాయకులు, సిరిసిల్ల జిల్లా నాయకుడు సురేందర్ రావు సహా పలువురు నేతలు బండి సంజయ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. “సంజయన్నా… మీరు సెస్ ఎన్నికల్లో కేటీఆర్ కు చుక్కలు చూపించారు. మాకు అండగా నిలిచి సహాయం చేశారు. మీ మేలు మేమెప్పటికీ మరవలేం. జన్మంతా రుణపడి ఉంటాం” అని కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!