Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Kcr Bjp Local Body Elections

Bandi Sanjay : కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం

Published Date :October 3, 2025 , 8:52 pm
By Gogikar Sai Krishna
  • కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేయనున్నాం
  • ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ ఆధిక్యత
  • అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగా.. పార్టీ సహాయం అందుబాటులో
  • గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం.. కేంద్ర నిధుల ప్రాధాన్యం
Bandi Sanjay : కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay : స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి బీజేపీ ఖాతాలో చేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికలు జరగాలని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని సంజయ్ తెలిపారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధులేమీ లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా మంది అప్పులు తీరచేయలేక ఊళ్లను వదిలి నగరాలకు వలస వెళ్ళారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తెచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రజలంతా కసరత్తు చేస్తున్నారు” అని అన్నారు.

మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, తాజా మాజీ సర్పంచులు, ఉద్యోగులే ఈసారి బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. “కాంగ్రెస్ పాలనలో ఈ వర్గాలందరికీ అన్యాయం జరిగింది. హామీలు ఇచ్చి ఒక్కటినీ అమలు చేయలేదు. మహిళలకు నెలనెలా 2500 రూపాయలు, వృద్ధులకు పెన్షన్ పెంపు, రైతులకు రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు భరోసా కార్డులు – అన్నీ మోసమే అయ్యాయి. ఈసారి ఈ వర్గాలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పబోతున్నారు” అని మండిపడ్డారు.

అభ్యర్థుల టిక్కెట్ల విషయంలో బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రాష్ట్ర నాయకత్వం సర్వేలు నిర్వహిస్తోందని సంజయ్ తెలిపారు. “గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తాం. టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దు. పార్టీ పదవుల రూపంలో గౌరవం, సహాయం అందిస్తాం. కానీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం” అని హెచ్చరించారు.

గ్రామాల్లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని సంజయ్ గుర్తుచేశారు. “ఉపాధి హామీ పనులు, ప్రధాని సడక్ యోజన, సీఐఆర్ఎఫ్ నిధులతో రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, బోర్లు – ఇవన్నీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లే సాధ్యమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాలేదు. బీఆర్ఎస్ గెలిచినా పరిస్థితి మారదు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం” అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక నాయకులు, సిరిసిల్ల జిల్లా నాయకుడు సురేందర్ రావు సహా పలువురు నేతలు బండి సంజయ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. “సంజయన్నా… మీరు సెస్ ఎన్నికల్లో కేటీఆర్ కు చుక్కలు చూపించారు. మాకు అండగా నిలిచి సహాయం చేశారు. మీ మేలు మేమెప్పటికీ మరవలేం. జన్మంతా రుణపడి ఉంటాం” అని కృతజ్ఞతలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp telangana
  • karimnagar
  • local body elections 2025
  • Sircilla

తాజావార్తలు

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions