Bandi Sanjay : కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
- కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేయనున్నాం
- ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ ఆధిక్యత
- అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగా.. పార్టీ సహాయం అందుబాటులో
- గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం.. కేంద్ర నిధుల ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి బీజేపీ ఖాతాలో చేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు జరగాలని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని సంజయ్ తెలిపారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధులేమీ లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా మంది అప్పులు తీరచేయలేక ఊళ్లను వదిలి నగరాలకు వలస వెళ్ళారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తెచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రజలంతా కసరత్తు చేస్తున్నారు” అని అన్నారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, తాజా మాజీ సర్పంచులు, ఉద్యోగులే ఈసారి బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. “కాంగ్రెస్ పాలనలో ఈ వర్గాలందరికీ అన్యాయం జరిగింది. హామీలు ఇచ్చి ఒక్కటినీ అమలు చేయలేదు. మహిళలకు నెలనెలా 2500 రూపాయలు, వృద్ధులకు పెన్షన్ పెంపు, రైతులకు రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు భరోసా కార్డులు – అన్నీ మోసమే అయ్యాయి. ఈసారి ఈ వర్గాలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పబోతున్నారు” అని మండిపడ్డారు.
అభ్యర్థుల టిక్కెట్ల విషయంలో బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రాష్ట్ర నాయకత్వం సర్వేలు నిర్వహిస్తోందని సంజయ్ తెలిపారు. “గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తాం. టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దు. పార్టీ పదవుల రూపంలో గౌరవం, సహాయం అందిస్తాం. కానీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం” అని హెచ్చరించారు.
గ్రామాల్లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని సంజయ్ గుర్తుచేశారు. “ఉపాధి హామీ పనులు, ప్రధాని సడక్ యోజన, సీఐఆర్ఎఫ్ నిధులతో రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, బోర్లు – ఇవన్నీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లే సాధ్యమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాలేదు. బీఆర్ఎస్ గెలిచినా పరిస్థితి మారదు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక నాయకులు, సిరిసిల్ల జిల్లా నాయకుడు సురేందర్ రావు సహా పలువురు నేతలు బండి సంజయ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. “సంజయన్నా… మీరు సెస్ ఎన్నికల్లో కేటీఆర్ కు చుక్కలు చూపించారు. మాకు అండగా నిలిచి సహాయం చేశారు. మీ మేలు మేమెప్పటికీ మరవలేం. జన్మంతా రుణపడి ఉంటాం” అని కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!