Bandi Sanjay: ఇంతదానికి ఎన్నికలెందుకు.. సెస్ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Fires On Cess Election Result: సెస్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెస్ ఎన్నికల ఫలితాల విషయంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఐదు స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ.. ఫలితాలను తారుమారు చేశారని వ్యాఖ్యానించారు. సెస్ను నాశనం చేసిన బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారా? అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ వాళ్లే ఓట్లేసుకొని, వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉంది కదా ఇష్టానుసారం వ్యవహరిస్తారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నా.. సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో మీ ఆటలు చెల్లవని, ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tammineni Veerabhadram: బీఆర్ఎస్తో పొత్తుల అంశం చర్చించలేదు.. అవన్నీ ఊహాగానాలే
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
అంతకుముందు.. ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత సీఎం కుటుంబంలో వణుకు మొదలైందన్నారు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా అహంకారంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం అభివృద్ధి చెందాలని మాయమాటలు చెబుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఎక్కడా ఇవ్వట్లేదని.. దాన్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ రైతు ద్రోహి అంటూ నిప్పులు చెరిగిన బండి సంజయ్.. యూరియా సబ్సిడీ ఇస్తోందని కేంద్రమేనని తెలిపారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం మోడీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ దివాలా దీసి బీఆర్ఎస్ వచ్చిందని సెటైర్లు వేసిన ఆయన.. రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? అని కేసీఆర్ను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!