Amnesia Pub Case: మనుషులా.? రాక్షసులా.?.. బండి సంజయ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్ కేసును పోలీసులు కావాలనే నీరుగారుస్తున్నారని.. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మే 28న ఫిర్యాదు అందితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. మూడు రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారని రాజా సింగ్ ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులపై ప్రెజర్ ఉందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమ్నేషియా పబ్, అమ్మాయి అత్యాచారం కేసుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీరు మనుషులా.? రాక్షసులా.? మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా.? అంటూ ప్రశ్నించారు. 5 రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా కేసు నీరుగారుస్తారా.? చంచల్ గూడ జైల్లో ఉండాల్సినోళ్లను సేఫ్ ప్లేస్ లో పెడతారా.? అంటూ ప్రశ్నించారు. హత్యలు, అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం ఫిడేల్ వాయిస్తున్నారా.? అంటూ మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతోందని విమర్శించారు.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరని హెచ్చరించారు. అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఓవైసీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతంలో మహిళలకు రక్షణ లేదని.. చెప్పకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. నిందితులను గుర్తించలేదని విధంగా ఉన్న సీసీ కెమెరాలతో ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!