Amnesia Pub Case: మనుషులా.? రాక్షసులా.?.. బండి సంజయ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్ కేసును పోలీసులు కావాలనే నీరుగారుస్తున్నారని.. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మే 28న ఫిర్యాదు అందితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. మూడు రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారని రాజా సింగ్ ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులపై ప్రెజర్ ఉందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమ్నేషియా పబ్, అమ్మాయి అత్యాచారం కేసుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీరు మనుషులా.? రాక్షసులా.? మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా.? అంటూ ప్రశ్నించారు. 5 రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా కేసు నీరుగారుస్తారా.? చంచల్ గూడ జైల్లో ఉండాల్సినోళ్లను సేఫ్ ప్లేస్ లో పెడతారా.? అంటూ ప్రశ్నించారు. హత్యలు, అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం ఫిడేల్ వాయిస్తున్నారా.? అంటూ మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతోందని విమర్శించారు.
Also Read
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
- CM Revanth Reddy: "ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత".. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరని హెచ్చరించారు. అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఓవైసీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతంలో మహిళలకు రక్షణ లేదని.. చెప్పకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. నిందితులను గుర్తించలేదని విధంగా ఉన్న సీసీ కెమెరాలతో ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
-
Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
ట్రెండింగ్
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..