Bandi Sanjay: జోగులాంబ అమ్మవారిని కించపరిచావ్.. కరీంనగర్ గతే పడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు. దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం లేని సంస్కార హీనుడివని విమర్శించారు.
తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారం జరుగుతుంటే పట్టుకోలేని చేతకాని దద్దమ్మవని తీవ్ర పదజాలంతో విమర్శించారు. యూపీలో క్రిమినల్స్ జైలు నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు కలిసి అత్యాచారాలు, హత్యలు, కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. వర్షాల నేపథ్యంలో ఇస్తాంబుల్, లండన్, సింగపూర్ ఏవని ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసే ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాడని ఎద్దేవా చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎక్కడ వరదలు వస్తే అక్కడికి వెళ్తున్నారని.. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడం లేదని అన్నారు. కేసీఆర్ దేశం అంతా తిరిగి బ్రాందీలు, బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు.
Also Read
Read Also: Pawan Kalyan: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టడమేంటి?
ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా, అత్యాచారాలకు గురైనా, ఉద్యోగులు, రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా బయటకు రావడం లేదని విమర్శించారు. మోదీకి కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తే… నువ్వు ఫామ్ హౌజుల నుంచి బయటకు రావని కేసీఆర్ ని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి అహంకారం పెరిగిందని.. అధికారాన్ని విసిరి పడేస్తానని అంటున్నాడని, ఎంత అహంకారం అని ప్రశ్నించారు. అధికారం తలకెక్కిందని.. నిన్ను , నీ కుటుంబాన్ని తీసుకెళ్లి ప్రజలు బయటపడేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!