Telangana Bandh: నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్.. కారణం ఇదీ..!
- నిరుద్యోగుల సమస్యలపై పోరాటం..
- నేడు తెలంగాణలో బంద్ కు నిరుద్యోగ సంఘ నేతలు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Bandh: నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు నిరుద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీని కూడా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ వారం రోజులుగా నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాగా.. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇస్తారో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
అయితే, నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కు రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ జేఏసీ, యువజన నాయకులు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. కాగా.. గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్తో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు మోతీలాల్ను కలిసేందుకు వచ్చిన నాయకులు రియాజ్, మానవతారాయ్, చెరగొండ వెంకటేష్, చంగాని దయాకర్, బాల లక్ష్మి, నిజాన రమేష్ తదితరులను నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరుద్యోగులను శాంతింపజేసి నాయకులను లోపలికి పంపించారు. నిరుద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డిని తక్షణమే చర్చలకు పిలవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. సీఎంతో చర్చించేందుకు ప్రయత్నిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం రేవంత్ చర్చకు పిలుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
ఇవీ డిమాండ్లు..
* గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
* గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
* 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
* గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్లాగ్లో ఉంచకూడదు
* నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!