Telangana Bandh: నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్.. కారణం ఇదీ..!
- నిరుద్యోగుల సమస్యలపై పోరాటం..
- నేడు తెలంగాణలో బంద్ కు నిరుద్యోగ సంఘ నేతలు పిలుపు..
Telangana Bandh: నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు నిరుద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీని కూడా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ వారం రోజులుగా నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాగా.. నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇస్తారో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
అయితే, నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కు రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ జేఏసీ, యువజన నాయకులు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. కాగా.. గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్తో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు మోతీలాల్ను కలిసేందుకు వచ్చిన నాయకులు రియాజ్, మానవతారాయ్, చెరగొండ వెంకటేష్, చంగాని దయాకర్, బాల లక్ష్మి, నిజాన రమేష్ తదితరులను నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరుద్యోగులను శాంతింపజేసి నాయకులను లోపలికి పంపించారు. నిరుద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డిని తక్షణమే చర్చలకు పిలవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. సీఎంతో చర్చించేందుకు ప్రయత్నిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం రేవంత్ చర్చకు పిలుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.
Read also: Aishwarya Rajesh: టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్!
ఇవీ డిమాండ్లు..
* గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
* గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
* 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
* గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్లాగ్లో ఉంచకూడదు
* నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!