రచ్చ దేనికి..? కేసీఆర్ డిమాండ్పై చర్చ పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన దేనికి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పారన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.. ఇక, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్రమే సీఎం కేసీఆర్ అన్నారని.. కేసీఆర్ మాట్లాడిన తెళ్లారికే రాజ్యాంగం మారిపోయినట్టు కాచుకు కూర్చున్నారంటూ మండిపడ్డారు.. కేసీఆర్ ఆలోచన సమాజం ముందు పెట్టారు.. దానిపై చర్చ పెట్టాలి.. కానీ, ఆందోళనలు ఎందుకు అని అని ప్రశ్నించారు.
Read Also: బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇక, కేసీఆర్ ఆలోచనపై చర్చ చేయడం ఇష్టం లేని వాళ్లు, చర్చ పక్కదోవ పట్టించే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్.. మారిన పరిస్థితుల నేపథ్యంలో చర్చ చేయాలి, డైనమిక్ గా ఉండాలన్నారు. 105 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది బీజేపీ..కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించిన ఆయన.. అంబేద్కర్ విధానం అమలుకు నోచుకోక దళితుల మీద దాడులు చేస్తుంది బీజేపీ కాదా..? అని మండిపడ్డారు.. కేసీఆర్ చర్చ పెట్టిన వెంటనే రాజ్యాంగం మారిందా? అని ప్రశ్నించిన బాల్క సుమన్.. రాజ్యాంగ ఫలాలు పేదలకు అందకపోతే నేనే రాజ్యాంగం తగలబెడ్త అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యసభలో చెప్పిన మాటలు వినాలని సూచించారు.. ఇక, రాజ్యాంగం సమీక్ష చేయాలని కమిషన్ వేసింది బీజేపీ… సావర్కర్, గాడ్సే వారసులు.. ఎస్సీ అట్రాసిటీ కేసులకు అమైండ్ మెంట్ చేసింది బీజేపీ కాదా..? అని నిలదీశారు బాల్క సుమన్.
- Tags
- Balka Suman
- bjp
- cm kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!