Worse in Warangal: అమ్మకానికి కన్న కొడుకు.. వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worse in Warangal: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నా కొడుకును తండ్రి అమ్మాకానికి పెట్టిన తీరు యావత్ ప్రపంచానికే దిగ్భాంతి కలిగేలా చేసింది. ఆర్థిక ఇబ్బందులో లేక ఎందుకు తనకు భారం అనుకున్నాడో తెలియదు కానీ.. కన్నకొడుకును తల్లికి తెలియకుండా అమ్మేశాడు తండ్రి. కన్న తండ్రి వేలు పట్టుకుని బయటకు వెళదామంటే సరే అని తల ఊపుతూ తనతో వెళ్లిన కొడుకును రెండు లక్షల 50 వేలకు అమ్మడంతో తండ్రి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కొడుకు. ఎవరితో వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తుండిపోయాడు. వేలు పట్టుకుని వచ్చిన నాన్నతో వెళ్లడానికి సిద్దమైన కొడుకును వేరే వారికి అప్పగించి వెళుతున్న నాన్నను “నాన్న” అంటూ పిలిచిన ఆ కసాయి తండ్రి వెనుతిరిగి కూడా చూడలేదు. చివరకు ఏడుస్తూ వారి భుజాలమీదే తలను పెట్టుకుని కంట నీరు వస్తున్నా ఏం చెప్పాలో అర్థం కానీ ఆ పసి హృదయాన్ని అర్థం చేసుకునేవారు కరవయ్యారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లి వెతకడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. తండ్రే కన్న కొడుకును తీసుకుని వెళ్ళాడని అనుమానం వచ్చి ప్రశ్నించడంతో భర్త గుర్తు రట్టైంది.
Read also: Namibia Study Tour: చిరుతలు ఎందుకు చనిపోతున్నాయి?.. అధ్యయనం కోసం నమీబియా స్టడీ టూర్
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
వరంగల్ జిల్లా మసూద్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే మసూద్ పెద్దకొడుకు అయాన్ ను అమ్మేందుకు ప్లాన్ వేశాడు. హైదరాబాద్ చెందిన ఓ కుటుంబానికి రెండు లక్షల 50 వేలకు అమ్మేందుకు బేరసారాలు చేశాడు. ఈ వ్యవహారం నడిపేందుకు శఖరాసికుంటకు చెందిన ఓ మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. చివరకు రెండున్నర లక్షలు ఇచ్చేందుకు ఇప్పుకుంది. అయితే.. నాలుగు రోజులుగా 4 ఏళ్ల తన పెద్ద కొడుకు అయాన్ కనిపించకపోవడంతో తండ్రిని ప్రశ్నించింది. ముందు తన సోదరి దగ్గర ఉంచినట్లు మసూద్ బుకాయించాడు. దీంతో మసూద్ మాటల పైన అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. బాలుడిని రెండు లక్షల 50 వేలకు అమ్మినట్లు తండ్రి చెప్పడంతో భార్య, కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కన్న బిడ్డను ఎలా అమ్మావు అంటూ ఛీదరించుకున్నారు. అయినా మసూద్ లో మనస్తాపం ఎక్కడా కనిపించలేదు. ఇక కొడుకును ఇంటికి తెచ్చుకుంటూ అంటూ భార్య చెప్పినా మసూద్ వినలేదు. నాకు తెలియదు వారు ఎక్కడకు తీసుకెళ్లారో అంటూ మాట దాటేశాడు. ఇక బాలుడి మేన మామ మసూద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
MS Dhoni: దటీజ్ ధోనీ.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరప్ప.. మెరుపు కంటే వేగం..!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!