Asaduddin Owaisi: పెట్రోల్ రేటు పెరగడానికి తాజ్మహలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ప్రసంగంలో ప్రతీసారి ముస్లిములు, మొగలుల ప్రస్తావన తీసుకురావడంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లిములనే బీజేపీ నిందిస్తోందని ఆరోపించిన ఆయన.. ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే.. ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 40 మాత్రమే ఉండేదని వ్యంగాస్త్రాలు చేశారు. అంతేకాదు.. యువత నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడంటూ సెటైర్ల మీద సెటైర్ల వేశారు.
‘‘ఈరోజు దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడానికి, ధరలు ఆకాశాన్నంటడానికి, లీటర్ – డీజెల్ ధరలు అమాంతం పెరగడానికి కారణం ప్రధాని మోదీ కాదు.. ఔరంగజేబు. నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. లీటర్ పెట్రోల్ ధర రూ.104-115కి చేరడానికి కారణం.. తాజ్మహల్ కట్టిన షాజహాన్! ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ కట్టి ఉండకపోతే, ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేది. ప్రధాని మోదీ చెప్పినట్టు.. తాజ్మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పు చేశారని నేను అంగీకరిస్తాను. వాటిని కట్టడానికి బదులు, ఆ డబ్బుల్ని దాచి, 2014 ఎన్నికల్లో మోదీ గెలుస్తారని తెలుసుకొని ఆ డబ్బంతా ఆయనకు ఇవ్వాల్సింది’’ అంటూ ఒవైసీ సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
దేశంలోని ప్రతీ సమస్యకు ముస్లిములు, మొగలులే కారణమని బీజేపీ ప్రచారం చేయడం ఏమాత్రం సబబు కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్ను కేవలం మొగలులే పరిపాలించలేదని.. అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడుతో పాటు ఇంకా చాలామంది పాలించారన్నారు. కానీ.. బీజేపీకి మాత్రం మొగలులే కనిపిస్తారని.. ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్తాన్ను చూస్తుందని మండిపడ్డారు. భారత ముస్లిములకు మొగలులు, పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదని.. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామని తేల్చి చెప్పారు. తమను వెళ్లగొట్టాలని ఎన్ని నినాదాలు చేసినా, తాము పట్టించుకోమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 – Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz
— AIMIM (@aimim_national) July 4, 2022
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!