Asaduddin Owaisi: పెట్రోల్ రేటు పెరగడానికి తాజ్మహలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ప్రసంగంలో ప్రతీసారి ముస్లిములు, మొగలుల ప్రస్తావన తీసుకురావడంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లిములనే బీజేపీ నిందిస్తోందని ఆరోపించిన ఆయన.. ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే.. ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 40 మాత్రమే ఉండేదని వ్యంగాస్త్రాలు చేశారు. అంతేకాదు.. యువత నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడంటూ సెటైర్ల మీద సెటైర్ల వేశారు.
‘‘ఈరోజు దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడానికి, ధరలు ఆకాశాన్నంటడానికి, లీటర్ – డీజెల్ ధరలు అమాంతం పెరగడానికి కారణం ప్రధాని మోదీ కాదు.. ఔరంగజేబు. నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. లీటర్ పెట్రోల్ ధర రూ.104-115కి చేరడానికి కారణం.. తాజ్మహల్ కట్టిన షాజహాన్! ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ కట్టి ఉండకపోతే, ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేది. ప్రధాని మోదీ చెప్పినట్టు.. తాజ్మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పు చేశారని నేను అంగీకరిస్తాను. వాటిని కట్టడానికి బదులు, ఆ డబ్బుల్ని దాచి, 2014 ఎన్నికల్లో మోదీ గెలుస్తారని తెలుసుకొని ఆ డబ్బంతా ఆయనకు ఇవ్వాల్సింది’’ అంటూ ఒవైసీ సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
దేశంలోని ప్రతీ సమస్యకు ముస్లిములు, మొగలులే కారణమని బీజేపీ ప్రచారం చేయడం ఏమాత్రం సబబు కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్ను కేవలం మొగలులే పరిపాలించలేదని.. అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడుతో పాటు ఇంకా చాలామంది పాలించారన్నారు. కానీ.. బీజేపీకి మాత్రం మొగలులే కనిపిస్తారని.. ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్తాన్ను చూస్తుందని మండిపడ్డారు. భారత ముస్లిములకు మొగలులు, పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదని.. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామని తేల్చి చెప్పారు. తమను వెళ్లగొట్టాలని ఎన్ని నినాదాలు చేసినా, తాము పట్టించుకోమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 – Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz
— AIMIM (@aimim_national) July 4, 2022
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!