Asaduddin Owaisi: ఒక ఉప ఎన్నిక కోసం.. ఇంత బరితెగించాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi Fires On BJP For Creating Rucks In Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ నగరంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే! ఈ పరిస్థితులపై తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. కేవలం ఒక ఉప ఎన్నికల (మునుగోడు) కోసం.. బీజేపీ ఇంతలా బరితెగించాలా? అంటూ మండిపడ్డ ఆయన.. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంకెంతలా ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. దుకాణాళ్లు, పాఠశాలలు మూయించి.. ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చేసి, కర్ఫ్యూ సృష్టించాలని బీజేపీ అనుకుంటోందని అభిప్రాయపడ్డారు. అల్లా దయతో ఇవన్ని జరగకూడదని కోరిన అసదుద్దీన్.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తోన్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామని అన్నారు.
అంతకుముందు.. రాజాసింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు గాను కేసులు నమోదు చేసి, ఆయన్ను జైలుకు పంపాలని ఒవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లే ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతి నెలకొందని ఆరోపించారు. భవిష్యత్తులో రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే.. అతనిపై కేసులు నమోదు చేసి, తప్పకుండా జైలుకి పంపాల్సిందేనన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయ్యుండి.. రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
బీజేపీ వక ఉప ఎన్నికల కోసం ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకనాళ్లు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇల్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ శ్రుష్టించాలని అనుకుంటున్నారా?
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
అల్లా దయతో ఇవన్ని జరగకూడదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రుష్టిస్తున్న హింసకాండనుంచీ విముక్తి పొందాలని అసిద్దం.
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
తాజావార్తలు
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!