Asaduddin Owaisi: ఒక ఉప ఎన్నిక కోసం.. ఇంత బరితెగించాలా?
Asaduddin Owaisi Fires On BJP For Creating Rucks In Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ నగరంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే! ఈ పరిస్థితులపై తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. కేవలం ఒక ఉప ఎన్నికల (మునుగోడు) కోసం.. బీజేపీ ఇంతలా బరితెగించాలా? అంటూ మండిపడ్డ ఆయన.. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంకెంతలా ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. దుకాణాళ్లు, పాఠశాలలు మూయించి.. ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చేసి, కర్ఫ్యూ సృష్టించాలని బీజేపీ అనుకుంటోందని అభిప్రాయపడ్డారు. అల్లా దయతో ఇవన్ని జరగకూడదని కోరిన అసదుద్దీన్.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తోన్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామని అన్నారు.
అంతకుముందు.. రాజాసింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు గాను కేసులు నమోదు చేసి, ఆయన్ను జైలుకు పంపాలని ఒవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లే ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతి నెలకొందని ఆరోపించారు. భవిష్యత్తులో రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే.. అతనిపై కేసులు నమోదు చేసి, తప్పకుండా జైలుకి పంపాల్సిందేనన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయ్యుండి.. రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
Also Read
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
బీజేపీ వక ఉప ఎన్నికల కోసం ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకనాళ్లు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇల్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ శ్రుష్టించాలని అనుకుంటున్నారా?
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
అల్లా దయతో ఇవన్ని జరగకూడదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రుష్టిస్తున్న హింసకాండనుంచీ విముక్తి పొందాలని అసిద్దం.
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
తాజావార్తలు
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో