JEE Exam: జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్.. ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Exam: తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1 సహా అనేక పరీక్షలు రద్దు చేయడంతో.. లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇప్పటికి సుమారు 45 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కీలక సూత్రధారులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read also: ATM : కార్డుతో పనిలేదు.. స్కాన్ చేసినా ATMనుంచి డబ్బులు వస్తాయి
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
జేఈఈ పరీక్షలో నలుగురు విద్యార్థులు స్మార్ట్ కాపీయింగ్కు పాల్పడ్డారు. వారు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కాపీ చేశారు. ఆదివారం పరీక్ష జరగగానే హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ కాపీయింగ్పై కేసు నమోదు చేశారు. అయితే ఈ స్మార్ట్ కాపీయింగ్లో కీలక సూత్రధారి కడప జిల్లాకు చెందిన టాపర్గా గుర్తించారు. టెన్త్, ఇంటర్ లో టాపర్. అయితే తన స్నేహితులకు మంచి మార్కులు పడేలా ఈ కాపీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లోని ఎస్వీఐఈ పరీక్షా కేంద్రం నుంచి అతడు ఈ కాపీయింగ్కు పాల్పడ్డాడు. హైటెక్ సిటీలోని ఓ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో ఎలాగైనా మంచి మార్కులు సాధించాలనుకున్నారు. వీరిలో కడప జిల్లాకు చెందిన విద్యార్థి ఒకరు. టెన్త్, ఇంటర్లో టాపర్. తన స్నేహితులు ఎలాగైనా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఓ కడప విద్యార్థి ఈ స్మార్ట్ కాపీయింగ్ చేశాడు. తన సమాధాన పత్రాన్ని వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంచుకున్నాడు. వివిధ సెంటర్లలో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా సమాధాన పత్రాన్ని పంపించాడు.
అయితే ఎస్వీఐటీ కళాశాల సెంటర్లో పరీక్ష రాస్తున్న కడప విద్యార్థిపై అబ్జర్వర్కు అనుమానం వచ్చింది. అతడిని తనిఖీ చేయగా ఓ స్మార్ట్ ఫోన్ దొరికింది. దీంతో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చైతన్యను హైదరాబాద్లోని దిల్ సుఖ్ నగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్పై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రశ్నిస్తున్నారు. నిందితులు వాట్సాప్తో పాటు మరేదైనా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల్లో నలుగురికి సహకరించిందెవరన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జేఈఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి పరీక్ష రాసిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది రెండు దశల్లో జరిగాయి. జేఈఈ తొలి దశ పరీక్ష ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది. జేఈఈ రెండో దశ పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జరిగింది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీ కేంద్రాల్లో 16,598 సీట్లు ఉన్నాయి.
Karnataka : దారుణం.. భార్య మార్మాంగాలను కోసి హత్య చేసిన భర్త..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!