Amit Shah Hyderabad Tour: అమిత్ షా హైదరాబాద్ టూర్.. భారీ సభకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Hyderabad Tour: కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై పెట్టింది.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అందులో భాగంగానే ఈ నెల 23న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పొలిటికల్ టూర్ లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కాషాయం పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా వచ్చే ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తారని, ఆ పర్యటనతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు బీజేపీ దూకుడు పెరుగుతుందని కమలనాథులు చెబుతున్నారు. అమిత్ షా సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అమిత్ షా బహిరంగ సభకు ఇంకా ఐదు రోజులే సమయం ఉండడంతో కాషాయ నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read also: Mental Health: మిమ్మల్ని మెంటల్ గా వీక్ చేసే అలవాట్లు..
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
గత రెండు నెలలుగా అమిత్ షా తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న అమిత్ షాకు ఆ రాష్ట్ర పర్యటనకు సమయం దొరకలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అమిత్ షా తెలంగాణా పర్యటనకు సమయం ఫిక్స్ అయింది. ప్రతి నెలా ఒక్కసారైనా తెలంగాణ పర్యటనకు వస్తానని గతంలో అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు హామీ ఇచ్చారు. అయితే దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. అయితే వచ్చే నెల 13వ తేదీతో కర్ణాటక ఎన్నికలు ముగుస్తున్నందున ఇకపై తెలంగాణలో అమిత్ షా వరుస పర్యటనలు చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అవసరమైతే అమిత్ షా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్రంలో బీజేపీ గెలుపునకు వ్యూహాలు రచించి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఉత్తరాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ కర్ణాటక, తెలంగాణలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉండగా, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు అవసరం. కర్నాటకలో మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ బీజేపీ క్యాడర్లో కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతుంది.
Harish Rao: ఉన్న మాటంటే ఉలుకెందుకు.. మరోసారి ఏపీ మంత్రులపై హరీశ్ రావు ఫైర్
తాజావార్తలు
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..