Amit Shah Hyderabad Tour: అమిత్ షా హైదరాబాద్ టూర్.. భారీ సభకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Hyderabad Tour: కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై పెట్టింది.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అందులో భాగంగానే ఈ నెల 23న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పొలిటికల్ టూర్ లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కాషాయం పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా వచ్చే ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తారని, ఆ పర్యటనతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు బీజేపీ దూకుడు పెరుగుతుందని కమలనాథులు చెబుతున్నారు. అమిత్ షా సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అమిత్ షా బహిరంగ సభకు ఇంకా ఐదు రోజులే సమయం ఉండడంతో కాషాయ నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read also: Mental Health: మిమ్మల్ని మెంటల్ గా వీక్ చేసే అలవాట్లు..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
గత రెండు నెలలుగా అమిత్ షా తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న అమిత్ షాకు ఆ రాష్ట్ర పర్యటనకు సమయం దొరకలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అమిత్ షా తెలంగాణా పర్యటనకు సమయం ఫిక్స్ అయింది. ప్రతి నెలా ఒక్కసారైనా తెలంగాణ పర్యటనకు వస్తానని గతంలో అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు హామీ ఇచ్చారు. అయితే దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. అయితే వచ్చే నెల 13వ తేదీతో కర్ణాటక ఎన్నికలు ముగుస్తున్నందున ఇకపై తెలంగాణలో అమిత్ షా వరుస పర్యటనలు చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అవసరమైతే అమిత్ షా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్రంలో బీజేపీ గెలుపునకు వ్యూహాలు రచించి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఉత్తరాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ కర్ణాటక, తెలంగాణలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉండగా, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు అవసరం. కర్నాటకలో మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ బీజేపీ క్యాడర్లో కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతుంది.
Harish Rao: ఉన్న మాటంటే ఉలుకెందుకు.. మరోసారి ఏపీ మంత్రులపై హరీశ్ రావు ఫైర్
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!