తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే మేడారం జాతరకు మళ్ళీ రంగం సిద్ధమయింది. ఫిబ్రవరిలో 16 నుండి19 వరకు జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఐ జి నాగిరెడ్డి పలు సూచనలు చేశారు. వీఐపీల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పదివేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మేడారం పరిసర ప్రాంతాలన్ని పరిశీలించడానికి 380 వరకు cc కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.జాతరలో ప్రతీ కదలికలను పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతరకు వచ్చే ప్రయివేట్ వాహనాల ట్రాఫిక్ కంట్రోల్ మొతం వరంగల్ సీపీ తరుణ్ జోషి చూస్తారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు పోలీస్ రెవెన్యూ అధికారులకు సహకరిస్తు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.