Ganesh Chaturdi: ఈసారి భారీగా మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి అంటే హైదరాబాద్ అందరికీ గుర్తుకు వస్తుంది. ఈసారి వినాయక చతుర్థి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరగనున్నాయి. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై సమావేశం జరిగింది. జూబ్లిహిల్స్ లోని MCRHRD లో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLC ప్రభాకర్ రావు, MLA దానం నాగేందర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
Read Also: Loan Apps New Cheating: అకౌంట్లో డబ్బులు వేస్తారు.. చీటర్ అనే ముద్రతో వేధింపులు
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల కోసం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే అన్ని రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈసారి ప్రజల్లో మట్టి విగ్రహాల ప్రాధాన్యతను మరింతగా తెలియచేసేందుకు మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ ఎక్కువగా చేపట్టనున్నారు. GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, HMDA ఆధ్వర్యంలో ఒక లక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష మట్టి విగ్రహాల పంపిణీ చేపడతారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడతాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
మరోవైపు హైదరాబాద్ లో గణేష్ చతుర్థి అంటే ఖైరతాబాద్ గణేశుడే గుర్తుకువస్తాడు. ఈసారి కూడా 50 అడుగుల మేర వినాయకుడు కొలువు తీరనున్నాడు. గతంలో నెలరోజుల ముందే ఈ లంబోదరుడి పనులు అన్నీ పూర్తయ్యేవి. కానీ ఈసారి వరుణుడి దెబ్బకు పనులు పెండింగ్ లో పడ్డాయి. గతానికి భిన్నంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి బదులుగా మట్టి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. సమయం దగ్గరపడుతుండడంతో పనులు వేగవంతం చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఆ పార్వతీ తనయుడు.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!