Ganesh Chaturdi: ఈసారి భారీగా మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి అంటే హైదరాబాద్ అందరికీ గుర్తుకు వస్తుంది. ఈసారి వినాయక చతుర్థి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరగనున్నాయి. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై సమావేశం జరిగింది. జూబ్లిహిల్స్ లోని MCRHRD లో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLC ప్రభాకర్ రావు, MLA దానం నాగేందర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
Read Also: Loan Apps New Cheating: అకౌంట్లో డబ్బులు వేస్తారు.. చీటర్ అనే ముద్రతో వేధింపులు
Also Read
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల కోసం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే అన్ని రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈసారి ప్రజల్లో మట్టి విగ్రహాల ప్రాధాన్యతను మరింతగా తెలియచేసేందుకు మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ ఎక్కువగా చేపట్టనున్నారు. GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, HMDA ఆధ్వర్యంలో ఒక లక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష మట్టి విగ్రహాల పంపిణీ చేపడతారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడతాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
మరోవైపు హైదరాబాద్ లో గణేష్ చతుర్థి అంటే ఖైరతాబాద్ గణేశుడే గుర్తుకువస్తాడు. ఈసారి కూడా 50 అడుగుల మేర వినాయకుడు కొలువు తీరనున్నాడు. గతంలో నెలరోజుల ముందే ఈ లంబోదరుడి పనులు అన్నీ పూర్తయ్యేవి. కానీ ఈసారి వరుణుడి దెబ్బకు పనులు పెండింగ్ లో పడ్డాయి. గతానికి భిన్నంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి బదులుగా మట్టి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. సమయం దగ్గరపడుతుండడంతో పనులు వేగవంతం చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఆ పార్వతీ తనయుడు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?