Akbaruddin Owaisi: స్లోపాయిజన్ ఇచ్చి హత్య చేయాలని చూస్తున్నారు.. ఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akbaruddin Owaisi Key Comments: లోక్సభ ఎన్నికల సందర్భంగా చంద్రయాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. పాతబస్తీ ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సోదరులను జైలుకు పంపాలని కొందరు అన్నారు. జైల్లో మందు పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని చంపేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మేం చాలా బలంగా ఉన్నామని, అందుకే మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా మేమే గెలుస్తామని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. జైల్లోనే స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేయడం ఇప్పుడు అందరిలోనూ పలు అనుమానాలకు దారి తీస్తోంది.
Read also: TS RTC: ఆర్టీసీ బస్సుల పై సమ్మర్ ఎఫెక్ట్.. మధ్యాహ్నం సర్వీసుల తగ్గింపు..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధికి సహకరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. కొందరు కాంగ్రెస్ బీ టీమ్ అంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమతో కలుస్తున్నారని అన్నారు.
Read also: Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.?
ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎంఐఎంను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని అక్బరుద్దీన్ అన్నారు. రావులు, రెడ్లు ఎంతమంది కలిసినా విజయం వారిదే అన్నారు. మా ఇద్దరి సోదరులను జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మందు పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలాంటి వాటికి భయపడేది లేదని, హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలుస్తామని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు.
BRS KTR: వరంగల్ పార్లమెంటుకు సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్
తాజావార్తలు
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Peddi : పెద్ది నాన్ తెలుగు స్టేట్స్ భారీ నష్టాల దిశగా.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!