Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.?
Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.? అంటూ రాజ్యసభ ఎంపీ డా. కె లక్ష్మణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి పూనుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అంటూ రేవంత్ మాట్లాడుతున్నాడని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఐదో ఎత్తుగడ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 రోజు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తా అన్నారు. వంద రోజుల పాలన అన్నారు.. విఫలం అయ్యారు. వరి పంటకు మద్దతు ధర తో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు.
Read also: PM Modi : అహంకారపూరితులే అలా అంటారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ మోడీ
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ఇవేమీ చేయలేదు.. కానీ మళ్ళీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బోనస్ ఇవ్వలేదు కానీ వచ్చే వరి పంటకు బోనస్ ఇస్తా అంటూ వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని తప్పించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద హామీల అమలుకు నిధులు లేవని తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతిపరులు అని అనేక సార్లు విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఎంఎల్ఏ లను ఎలా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నావ్? ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరగానే అవినీతి తొలిగిపోతుందా సమాధానం చెప్పాలన్నారు.
Read also: Bombay High Court: నిద్ర హక్కు మానవ ప్రాథమిక అవసరం.. దానిని ఉల్లంఘించకూడదు: బాంబే హైకోర్టు
రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ నీ.. ఎందుకు రోజూ ఏదో ఒక రకంగా తెర మీదకు తెస్తున్నారని ప్రశ్నించారు. మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కానీ మోడీ గత పది ఏళ్లుగా చేసిన అభివృద్ధితో మోడీ నుండి ప్రజల దృష్టి మరల్చలేరని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించాలని కోరుతున్నానని అన్నారు. ఓవైసి ఓటమి బయంతో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదన్నారు. మా అభ్యర్థి మాధవీ లతను చూసి వారికి ఓటమి బయం పట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Bombay High Court: నిద్ర హక్కు మానవ ప్రాథమిక అవసరం.. దానిని ఉల్లంఘించకూడదు: బాంబే హైకోర్టు
తాజావార్తలు
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!