అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై హైకోర్టులో విచారణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుపుతుంది. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు తీవ్రంగా స్పందించారు జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్. అగ్రిగోల్డ్ కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిస్తే మరో ఇరవై ఏళ్లు హైకోర్టు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్న హైకోర్టు… అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన సవరించిన ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా ఆంధ్రాలో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టు కు ఎపి విభజన చట్టం ప్రకారం బదిలీ చేసే విషయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తున్నారని సంకేతాలు వచ్చాయి. బినామీ ద్వారా మిడ్జిల్ లో అగ్రిగోల్డ్ యాజమాన్యం భూములు కొనింది అని సంచలన అఫిడవిట్ దాఖలు చేసారు తెలంగాణ సిఐడి ఎస్పి.
మిడ్జిల్ లో 15.18 కోట్లు పెట్టి 150 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి అగ్రిగోల్డ్ కంపెనీ బినామీ అని సందేహం వ్యక్తం చేసిన తెలంగాణ సిఐడి… అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్ అవ్వా సీతారామ రావు కు చెందిన శివశక్తి టింబర్ ఎస్టేట్ తో బిడ్ లో పాల్గొన్న వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పనిచేసిన వ్యక్తి 15.18 కోట్లు పెట్టి 150 ఎకరాలు కొనే సామర్థ్యం లేదని ఇన్ కం టాక్స్ శాఖ ద్వారా సేకరించిన వివరాలు సమర్పించారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
రెండు రాష్ట్రాలు అగ్రిగోల్డ్ సమస్యపై చర్చించి కలిసి పరిష్కారం కనుక్కునేందుకు హైకోర్టును సమయం కోరిన ఎపి అడ్వకేట్ జనరల్ శ్రీ రామ్… విజయవాడలో ఎస్బిఐ నిర్వహించిన వేలంలో అగ్రిగోల్డ్ కు చెందిన షాపింగ్ మాల్ ను సింగిల్ బిడ్డర్ కు కేటాయించడం పై సిఐడి పరిశీలన జరిపేందుకు సమయం కావాలని కోరారు ఎపి అడ్వకేట్ జనరల్. ఈ కేసులో తదుపరి విచారణ 25.6.2021 కి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!