Agnipath Scheme: వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్.. పెట్రోల్ బాటిల్ తో.. రావాలంటూ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ లో 300 మంది అభ్యర్థులనువచ్చినట్లు, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసారు. ఐఆర్ఎ రైల్వే చట్టం సెక్షన్ 150 నమోదు చేసిన పోలీసులు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణశిక్ష పడే అవకాశం వుందని వెల్లడించారు.
Also Read
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
గురువారం నాడు వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్
పెట్రోల్ బాటిల్ పట్టుకొని రావాలంటూ ఆదేశాలు అందాయని, పెట్రోల్ తో పాటుగా టైర్లు పాత దుస్తులు తీసుకొని రావాలని ఆదేశింనట్లు కాల్ రికార్డింగ్ గుర్తించారు పోలీసులు. పెట్రోల్ తీసుకువచ్చి తల తగలపెడితే విషయం మొత్తం తెలుస్తుందని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరని ఆందోళనకారులు చెప్పడంతో ఇంత విధ్వంసానికి దారితీసిందని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తున్న ప్రతి ఒక్కరు పెట్రోల్ బాటిల్ తో రావాలని చెప్పిన తీరు పోలీసులకు దిగ్భ్రాంతిని గురిచేసింది. వాట్సాప్ గ్రూప్ ల నుండే విధ్వంసం ప్లాన్ చేసుకున్నారని తెలుసుకున్న పోలీసులు వారి వద్దనుంచి పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని ఆడియో సంభాషణ లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ఆర్గనైజర్స్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.నిన్న స్టేషన్ లో ఆందోలనకారులని అరెస్ట్ చేసిన పోలీసులు.
గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో జరిగిన కాల్పులలో గాయపడిన వారికి గాంధీ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. 10 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్లోకి ఇతరులను పోలీసులు రానివ్వడం లేదు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది సహా పేషేంట్స్, అటెండెంట్స్ ఐడీలు చూసిన తర్వాత పోలీసులు లోపలికి అనుమతి ఇస్తున్నారు.
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!