Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- కేటీఆర్ సభపై అడ్లూరి విమర్శలు
- 'పెయిడ్ ఆర్టిస్టులతోనే సభ' ఆరోపణ
- 67,700 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
- బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adluri Laxman : హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన యువజన సభపై రాష్ట్ర ప్రభుత్వ విప్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తన సభలో అసలైన నిరుద్యోగులతో కాకుండా, కేవలం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం పేపర్ లీకేజీల పాలనగా మారిందని మండిపడ్డారు. కేటీఆర్ ది పూర్తిగా పాపాల చిట్టా అని, వారి హయాంలో జిరాక్స్ సెంటర్లలో సైతం ప్రభుత్వ ఉద్యోగాల క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న దుస్థితి నెలకొందని ఆరోపించారు. పరీక్షా కేంద్రాల బాధ్యతలను సైతం తమ సొంత బంధువులకు అప్పగించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు.
67,700 మందికి ఉద్యోగాలిచ్చాం.. వాస్తవం కాదా
బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను కేటీఆర్, ఆయన తండ్రి కేసీఆర్, బావ హరీష్ రావు, చెల్లెలు కవిత కలిసి తీవ్రంగా వంచించారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శిల్పకళావేదిక వేదికగా రికార్డు స్థాయిలో 67,700 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాగే ఎల్బీ నగర్ స్టేడియంలో వేలాది మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానిదేనన్నారు. గతంలో యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్ నేతలు, ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సాధకబాధల్లో పాలుపంచుకున్నారా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ యువత పక్షాన నిలబడి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
మీ ఉనికి గల్లంతవుతుందనే భయంతోనే అబద్ధాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, భవిష్యత్తులో తమ రాజకీయ ఉనికి పూర్తిగా గల్లంతవుతుందనే భయంతోనే కేటీఆర్ పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. సీఎంపై విమర్శలు చేసే ముందు, జైల్లో ఉన్న తన సొంత సోదరి కవిత పెడుతున్న శాపనార్థాలకు, ఆమె మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత తోడబుట్టిన చెల్లెలే శాపనార్థాలు పెట్టే స్థితికి కేటీఆర్ దిగజారారని విమర్శించారు. కేటీఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ యువత, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!