Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లకు అదనపు బోగీలు.. మూడు కోచ్లు ఏర్పాటు చేయనున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మెట్రోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో ప్రారంభంలో రోజుకు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. అయితే ఇప్పుడు రోజూ 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. ట్రాఫిక్ సమస్యను నివారించడంతోపాటు త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడం వల్ల చాలా మంది మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సొంత వాహనాలు ఉన్నవారు సైతం ట్రాఫిక్ దృష్ట్యా వాటిని పక్కన పెట్టి త్వరగా కార్యాలయానికి చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేదు. అలాంటి సమయాల్లో తదుపరి రైలు కోసం వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో మెట్రో రైళ్ల బోగీల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు వారి కోరిక నెరవేరనుంది. ఆగస్టు నాటికి మూడు అదనపు కోచ్లను మెట్రో రైళ్లకు ఏర్పాటు చేయనున్నారు.
Read also: Ankitha : ఆ సినిమా నిరాశ పరచడంతో సినిమాలకు దూరం అయ్యాను..
Also Read
ప్రస్తుతం అదనపు కోచ్లను కొనుగోలు చేయడానికి సమయం పట్టవచ్చు. అందుకే కోచ్లను అద్దెకు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు చెన్నై, నాగ్ పూర్ మెట్రో అధికారులతో అద్దెకు మాట్లాడుతున్నారు. ఆగస్టు నాటికి మెట్రో రైళ్లకు అదనపు కోచ్లు రానున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి. అదనపు కోచ్లు ఏర్పాటు చేసినా మెట్రో రైళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్లాట్ఫారమ్లు, ట్రాక్లు, ఎలివేటెడ్ కారిడార్ల పొడవు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇతర మార్గాలతో పోలిస్తే ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఈ మార్గంలోని అన్ని రైళ్లకు త్వరలో మూడు అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లలో మూడు కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆరబోగి మహిళలు, వృద్ధులకు ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఇవి కాకుండా మిగతా ప్రయాణికులకు సీటింగ్ సరిపోవడం లేదు. ఇప్పుడు మరో ముగ్గురు కోచ్ల చేరికతో మొత్తం కోచ్ల సంఖ్య ఆరుకు చేరుతుంది. దీంతో సీటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మెట్రో విస్తరణకు కూడా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Warangal: వరంగల్ రైల్వే స్టేషన్లో ఊడిపడ్డ రేకులు.. ప్రయాణికులకు గాయాలు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!