Site icon NTV Telugu

Aadi Srinivas : హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..

Aadi Srinivas

Aadi Srinivas

Aadi Srinivas : జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చర్యలపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.. “పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలి. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్ కోసం టెండర్లు పిలిచారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి” అని అన్నారు.

Shubman Gill : రోహిత్ శర్మకు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్..

కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం విషయంలో హరీష్ రావు ఆరోపణలు నిజం కాదని ఆయన తేల్చారు. “విదేశాల నుంచి ఆధునిక వైద్య పరికరాలు రావాల్సి ఉండటంతో కొంత సమయం పడుతోంది. కానీ పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని మాకు ఉద్దేశం లేదు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతోనే ప్రజలకు అందించబోతున్నాం” అని వివరించారు. “ఉస్మానియా వర్షాల్లో మునిగిపోయినా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కానీ మా సీఎం గోషామహల్‌లో ఆధునిక సౌకర్యాలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది” అని చెప్పారు.

అలాగే వరంగల్‌లో ఎంజిఎం ఆస్పత్రి నిర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. “త్వరలోనే ఆ ఆస్పత్రిని కూడా ప్రారంభించబోతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కోట్లాది రూపాయలను పేదలకు అందిస్తున్నాం” అని గుర్తు చేశారు. “పదేళ్ల పాటు ప్రభుత్వాస్పత్రులను గాలికి వదిలేసి ఇప్పుడు మాకు పాఠాలు చెబుతున్నారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు హరీష్ రావు, కేటీఆర్‌లను పట్టించుకోరు” అని వ్యాఖ్యానించారు.

IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్‌ మ్యాచ్‌.. భారత్ ఘన విజయం

Exit mobile version