Hyderabad Traffic: ఉన్నోడి వల్ల ఇబ్బంది పడుతున్న పేదోడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్జామ్లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్జామ్కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం కూడా కారణమే అన్న వాదనలు లేకపోలేదు.
Read Also: Congress: ఆగస్టు మొదటివారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఒక్కరి కోసం కారు.. దర్పం కోసమేనా?
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అంటే కరోనా తర్వాత చేతిలో కాస్త డబ్బులుంటే చాలు కారు కొనుగోలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. సౌలభ్యం కోసం కారు కొనుగోలు చేయడంలో తప్పు లేదు. కానీ ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు రోడ్డుకు చాలనంత కారును కొనుగోలు చేసి సామాన్యులను ఇబ్బంది పడేలా చేయడమే తప్పు. ప్రస్తుతం కారు డ్రైవింగ్ చేసే వాళ్లలో 100 శాతం డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సరిగ్గా డ్రైవింగ్ రాకుండానే రోడ్డు మీదకు కారును తీసుకువెళ్లి ట్రాఫిక్కు అంతరాయం కలిగించేవాళ్లు చాలామందే ఉన్నారు.
అప్పుడు సిగ్నళ్లు.. ఇప్పుడు యూటర్నులు
ఒకప్పుడు నగరంలో జంక్షన్ల వద్ద రెడ్ సిగ్నల్ పడితే కిలోమీటర్, రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించేది. కానీ ఇప్పటి ప్రభుత్వం ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పలుచోట్ల సిగ్నళ్లు తొలగించి యూటర్నులు ఏర్పాటు చేసింది. అయితే కారు డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడం కారణంగా చాలా మంది యూటర్నుల వద్ద తమ వాహనాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు సరి, బేసి విధానంలో వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుందంటే.. ఒకవేళ ఐటీ ఆఫీసులన్నీ ఓపెన్ చేస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయం వేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!