Kamareddy: ఫంక్షన్ వెళ్లి బిర్యాని తిన్నాడు.. గొంతులో బోన్ ఇరుక్కుని విలవిల లాడాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: అదృష్టం బాగాలేకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరిగిపోతుందన్న సామెత వినే ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే కామారెడ్డిలో కూడా జరిగింది. ఓ వ్యక్తి ఫంక్షన్ వెళ్లి బిర్యాని తింటుండగా బోన్ గొంతులో ఇరుక్కుని విలవిలలాడాడు.. ఊపిరి ఆడకపోవడంతో అస్వస్తతకు గురయ్యాడు. చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.
Read also: NIA Raids: మహారాష్ట్ర-కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల కుట్రపై నిఘా
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన బంధువుల ఇంటిలో ఫంక్షన్ కి వెళ్లాడు. ఇక డిన్నర్ టైం కావడంతో అన్నం తినేందుకు బాలయ్య వెళ్లాడు. బిర్యాని ప్లేట్లో వేయించుకుని తింటుండగా ఒక్కసారి అస్వస్థకు గురయ్యాడు. గొంతులో మటన్బోన్ ఇరుక్కుపోవడంతో మాటలు కూడా మట్లాడలేకపోయాడు. ఊపిరి ఆడకపోవడంతో విలవిల లాడాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని గమనించి ఏం జరిగిందని అడిగినా బాలయ్య సమాధానం చెప్పలేక సైగలు చేశాడు. దీంతో అక్కడున్న వారందరూ గొంతులో ఇరుక్కున్న బోన్ ను తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు చేసేది ఏమీలేక కామారెడ్డిలోని ఆసుపత్రికి బాలయ్యను తీసుకుని వెళ్లారు. బాలయ్యను చూసిన వైద్యుడు సాకేత్ బోన్ తీయకుంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాలయ్యను కాపాడాలని వైద్యునికి కోరగా.. బాలయ్య గొంతులో ఇరుక్కున్న బోన్ ను చాకచక్యంగా డాక్టర్ సాకేత్ బయటకు తీసాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో సమయస్పూర్తితో బాలయ్య ప్రాణాలు కాపాడిన వైద్యుడు సాకేత్కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో వైద్యుడు సాకేత్ మాట్లాడుతూ ఏదైనా పదార్థాలు తినే టప్పుడు జాగ్రత్త అవసరమని లేదంటే ప్రాణాలతో పోరాడాల్సి వస్తుందని తెలిపారు.
Read also: Income Tax Raid : మూడు రోజుల్లో 300 కోట్లు, నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది
తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడ మండలం కోనాపురానికి చెందిన కుంజా ముత్తయ్య అనే వృద్ధుడు గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి మృతి చెందాడు. ముత్తయ్య తన కొడుకుతో కలిసి మటన్ కర్రీతో భోజనం చేశాడు. భోజనం చేస్తుండగా ముత్తయ్య గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ముత్తయ్య ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఎంత ప్రయత్నించినా..బోన్ బయటకు రాకపోవడంతో.. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. ముత్తయ్య గతంలో జనశక్తి పార్టీకి చెందిన మూడు జిల్లాలకు డిప్యూటీ ఫోర్స్ కమాండర్గా పనిచేశారు. గతంలో ఇదే జిల్లాలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. బాలానగర్ మండలం ఉదిత్యకు చెందిన పోచయ్యగౌడ్ అనే వ్యక్తి… చికెన్ తింటుండగా ప్రమాదవశాత్తు గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. గొంతు అడ్డం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు పోచయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్..
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!