Kamareddy: ఫంక్షన్ వెళ్లి బిర్యాని తిన్నాడు.. గొంతులో బోన్ ఇరుక్కుని విలవిల లాడాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: అదృష్టం బాగాలేకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరిగిపోతుందన్న సామెత వినే ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే కామారెడ్డిలో కూడా జరిగింది. ఓ వ్యక్తి ఫంక్షన్ వెళ్లి బిర్యాని తింటుండగా బోన్ గొంతులో ఇరుక్కుని విలవిలలాడాడు.. ఊపిరి ఆడకపోవడంతో అస్వస్తతకు గురయ్యాడు. చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.
Read also: NIA Raids: మహారాష్ట్ర-కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల కుట్రపై నిఘా
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన బంధువుల ఇంటిలో ఫంక్షన్ కి వెళ్లాడు. ఇక డిన్నర్ టైం కావడంతో అన్నం తినేందుకు బాలయ్య వెళ్లాడు. బిర్యాని ప్లేట్లో వేయించుకుని తింటుండగా ఒక్కసారి అస్వస్థకు గురయ్యాడు. గొంతులో మటన్బోన్ ఇరుక్కుపోవడంతో మాటలు కూడా మట్లాడలేకపోయాడు. ఊపిరి ఆడకపోవడంతో విలవిల లాడాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని గమనించి ఏం జరిగిందని అడిగినా బాలయ్య సమాధానం చెప్పలేక సైగలు చేశాడు. దీంతో అక్కడున్న వారందరూ గొంతులో ఇరుక్కున్న బోన్ ను తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు చేసేది ఏమీలేక కామారెడ్డిలోని ఆసుపత్రికి బాలయ్యను తీసుకుని వెళ్లారు. బాలయ్యను చూసిన వైద్యుడు సాకేత్ బోన్ తీయకుంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాలయ్యను కాపాడాలని వైద్యునికి కోరగా.. బాలయ్య గొంతులో ఇరుక్కున్న బోన్ ను చాకచక్యంగా డాక్టర్ సాకేత్ బయటకు తీసాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో సమయస్పూర్తితో బాలయ్య ప్రాణాలు కాపాడిన వైద్యుడు సాకేత్కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో వైద్యుడు సాకేత్ మాట్లాడుతూ ఏదైనా పదార్థాలు తినే టప్పుడు జాగ్రత్త అవసరమని లేదంటే ప్రాణాలతో పోరాడాల్సి వస్తుందని తెలిపారు.
Read also: Income Tax Raid : మూడు రోజుల్లో 300 కోట్లు, నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది
తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడ మండలం కోనాపురానికి చెందిన కుంజా ముత్తయ్య అనే వృద్ధుడు గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి మృతి చెందాడు. ముత్తయ్య తన కొడుకుతో కలిసి మటన్ కర్రీతో భోజనం చేశాడు. భోజనం చేస్తుండగా ముత్తయ్య గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ముత్తయ్య ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఎంత ప్రయత్నించినా..బోన్ బయటకు రాకపోవడంతో.. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. ముత్తయ్య గతంలో జనశక్తి పార్టీకి చెందిన మూడు జిల్లాలకు డిప్యూటీ ఫోర్స్ కమాండర్గా పనిచేశారు. గతంలో ఇదే జిల్లాలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. బాలానగర్ మండలం ఉదిత్యకు చెందిన పోచయ్యగౌడ్ అనే వ్యక్తి… చికెన్ తింటుండగా ప్రమాదవశాత్తు గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. గొంతు అడ్డం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు పోచయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్..
తాజావార్తలు
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!