Minor Lovers Suicide: సిద్దిపేటలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని మైనర్ ప్రేమ జంట ఆత్మహత్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Lovers Suicide: ప్రేమ రెండు అక్షరాలు మాత్రమే. కానీ ఆ ప్రేమ అనే మత్తులో మైమరచిపోతుంటారు యువత. మరికొందరైతే ‘ప్రే’ అంటే ప్రేమించడం ‘మ’ అంటే మరిచిపోవడం అని లైట్గా తీసుకుని జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే మరికొందరికైతే ప్రేమను తన జీవితంలో ఒక భాగంగా ఫీలవుతూ ఉంటారు. ప్రేమే జీవితం ప్రేమే సర్వస్వం. ఇదే ప్రేమ కొందరిని బలి తీసుకుంటే.. మరి కొందరిని కలుపుతుంది. తెలిసి తెలియని ప్రేమలో పడి కొందరు వారి జీవితాలను ముగించేసుకుంటుంటారు. ప్రేమలో పడినవారు వారి మతాలు, వ్యక్తిత్వాలు, కుటుంబాలు ఏమీ గుర్తుకు రావు. కానీ పెళ్లి మాట వచ్చేసరికి ఇద్దరి కుటుంబాలతో ముడిపడి ఉంటుందని మాత్రం ప్రేమలో పడిన ఇద్దరు ప్రేమికులకు అప్పటి గానీ అర్థంకాదు. దానికి తోడు వారిద్దరు మైనర్లు అయితే ఇక కుటుంబాలు అడ్డుచెప్పకుండా ఏమవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక సినిమాలను ఫాలో అవుతుంటారు కొందరు. దీంతో జీవితంలో వేరే వారితో కలిసి ఉండలేక కలిసి చావడానికి సిద్దపడుతుంటారు. ప్రేమ మత్తులో కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆలోచించరు. ఒకరినొకరు కలిసి చనిపోతున్నామని మాత్రమే వారికి గుర్తు ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథే సిద్దిపేటలో చోటుచేసుకుంది.
Read also: Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
Also Read
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ అదే గ్రామానికి చెందిన తొట్ల నేహ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరిద్దరు కొద్దిరోజులుగా కలిసి తిరుగుతుండడంతో ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే రెండు కులాలు విడిపోవడంతో పెద్దలు విడిపోతారని భయపడే మైనర్ ప్రేమికులు ఉన్నారు. ఆ భయం మరింత పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో భగీరథ ఇంట్లో కలిశారు. అనంతరం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఇద్దరు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ ప్రేమికుడి ఆత్మహత్యతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Bank Scheme: రిస్క్ లేకుండా.. రూ.5 లక్షలు పొందే సూపర్ స్కీమ్..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!