Hyderabad: మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.. 8 మందికి అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ వ్యక్తి హోటల్ కు వెళ్ళాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. అవస్థలు పడి ఆసుపత్రి లో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈనెల 22వ తేదీన బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నరు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి దీంతో శంషాబాద్ ని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతోపాటు ఆయన భార్య మంగమ్మ కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరూద్, అభిలాష్, జోష్ణ, సాయి, శ్రీకర్, మొత్తం ఎనిమిది మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాద్ నగర్ పట్టణంలో గత కొంతకాలంగా హోటల్స్ రెస్టారెంట్లు బిర్యాని సెంటర్లు ఎక్కడ కూడా పరిశుభ్రత పాటించకపోవడం నాణ్యత ప్రమాణాలు కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నాయి.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
Read also: MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట బిర్యానీలలో ఈగలు దోమలు పురుగుల కథనాలు వెలుగులోకి వస్తున్న సంబంధిత అధికారులు మాత్రం తాత్కాలికంగానే ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. ఎక్కడ కూడా తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించకపోవడంతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు పెళ్లిరోజు ఉంది కదా బిర్యాని తిని హోటల్లో వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఆసుపత్రిలో లక్ష రూపాయలకు దారితీసిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు షాద్ నగర్ పట్టణంలో ఉన్న హోటల్లో రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్ లలో పరిశుభ్రత పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బోజన ప్రియులు..
Pushpa 2 Second Single : 6 భాషల్లో పాట పాడిన ఆ స్టార్ సింగర్..?
తాజావార్తలు
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!