CP CV Anand: దేశంలో నెట్వర్క్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా.. 2 ముఠాలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అన్ని నగరాల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న 2 ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. ఢిల్లీ కేంద్రంగా కొకైన్ సరఫరా జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఎబుకా సుజీ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడని, అతని కోసం గాలించినా దొరకలేదని తెలిపారు. ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయని.. అక్కడ డీఆర్ఐ గ్యాంగ్కు ఇతనికి సంబంధాలు ఉన్నాయన్నారు. వీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ , స్నాప్ చాట్ కొన్ని యాప్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తున్నారని సీపీ చెప్పారు. ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశామన్నారు.
హేన్రీ చిగ్బో అనే వ్యక్తి టూరిస్ట్ వీసా మీద వచ్చాడని.. కానీ వీసా గడువు ముగిసిన ఇండియాలో ఉంటూ డ్రగ్స్ ద్వారా సప్లై చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. ఇక గ్రాము 8 వేలకు కొనుగోలు చేసి పది వేలకు అమ్మకాలు చేస్తున్నారని సీపీ వివరించారు. ఇమాన్యుల్ అనే మరో కీలక నిందితుడు ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని.. ఇమాన్యుల్, ఎబుకా సుజీ ఇద్దరు ఒకే గ్యాంగ్కి చెందిన వారుగా అనుమానిస్తున్నామన్నారు. త్వరలో వీరిని పట్టుకుంటామన్నారు.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
వీసాలు ముగిసినా ఇండియాలో ఉంటున్న నైజీరియన్లను వారి దేశాలకు పంపుతామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఐదుగురిని వారి దేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. మన దేశంలోకి వచ్చి అక్రమంగా ఉంటున్నారని, వీసాలు గడవు ముగిసిన తరువాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో వీరు బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేశారని స్పష్టం చేశారు. ఎయిర్ టికెట్లు కొనుగోలు చేసి స్వయంగా వారిని వారి దేశానికి అప్పగిస్తున్నామని తెలిపారు. 2500 మంది ఆఫ్రికన్స్ ఉంటే అందులో 750 మంది పైగానే వీసాలు గడువు ముగిసిన వారు ఉన్నారన్నారు. కార్డెన్స్ సెర్చ్ చేసి మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వీరిపై కేసులు లేకుండా వారిని వారి దేశాలకు పంపుతున్నామని తెలిపారు. వీరిపై కేసులు పెడితే వారిని వారి దేశానికి పంపడానికి ఇబ్బంది ఉంటుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!