CP CV Anand: దేశంలో నెట్వర్క్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా.. 2 ముఠాలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అన్ని నగరాల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న 2 ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. ఢిల్లీ కేంద్రంగా కొకైన్ సరఫరా జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఎబుకా సుజీ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడని, అతని కోసం గాలించినా దొరకలేదని తెలిపారు. ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయని.. అక్కడ డీఆర్ఐ గ్యాంగ్కు ఇతనికి సంబంధాలు ఉన్నాయన్నారు. వీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ , స్నాప్ చాట్ కొన్ని యాప్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తున్నారని సీపీ చెప్పారు. ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశామన్నారు.
హేన్రీ చిగ్బో అనే వ్యక్తి టూరిస్ట్ వీసా మీద వచ్చాడని.. కానీ వీసా గడువు ముగిసిన ఇండియాలో ఉంటూ డ్రగ్స్ ద్వారా సప్లై చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. ఇక గ్రాము 8 వేలకు కొనుగోలు చేసి పది వేలకు అమ్మకాలు చేస్తున్నారని సీపీ వివరించారు. ఇమాన్యుల్ అనే మరో కీలక నిందితుడు ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని.. ఇమాన్యుల్, ఎబుకా సుజీ ఇద్దరు ఒకే గ్యాంగ్కి చెందిన వారుగా అనుమానిస్తున్నామన్నారు. త్వరలో వీరిని పట్టుకుంటామన్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
వీసాలు ముగిసినా ఇండియాలో ఉంటున్న నైజీరియన్లను వారి దేశాలకు పంపుతామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఐదుగురిని వారి దేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. మన దేశంలోకి వచ్చి అక్రమంగా ఉంటున్నారని, వీసాలు గడవు ముగిసిన తరువాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో వీరు బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేశారని స్పష్టం చేశారు. ఎయిర్ టికెట్లు కొనుగోలు చేసి స్వయంగా వారిని వారి దేశానికి అప్పగిస్తున్నామని తెలిపారు. 2500 మంది ఆఫ్రికన్స్ ఉంటే అందులో 750 మంది పైగానే వీసాలు గడువు ముగిసిన వారు ఉన్నారన్నారు. కార్డెన్స్ సెర్చ్ చేసి మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వీరిపై కేసులు లేకుండా వారిని వారి దేశాలకు పంపుతున్నామని తెలిపారు. వీరిపై కేసులు పెడితే వారిని వారి దేశానికి పంపడానికి ఇబ్బంది ఉంటుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!