Kishan Reddy: ఆ పంట సాగుకు అనుకూలమైన భూమి తెలంగాణలోనే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: దేశ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 15% భూమి తెలంగాణలోనే ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమం తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 వరకు 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందని అన్నారు. పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019-20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచి, మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యమన్నారు.
Read also: Taj Mahal: తాజ్ మహల్ సందర్శించాలంటే.. కోవిడ్ పరీక్ష తప్పనిసరి
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ఈ పథకం యొక్క మొత్తం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం 8,844 కోట్లను ఖర్చు చేయనుందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జెనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ. 3,560 కోట్లని తెలిపారు. పామాయిల్ సాగుకు దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి అనుకూలంగా ఉంటే, అందులో 15% అనగా 4.36 లక్షల హెక్టార్ల భూమి తెలంగాణలో ఉందని తెలిపారు.
Read also: Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు
తెలంగాణలోని ఈ 4.36 లక్షల హెకార్ల భూమి అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి 27 జిల్లాలలో విస్తరించి ఉందనిపేర్కొన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశ్యంగా NMEO-OP యొక్క మార్గదర్శకాలను రూపొందించటం జరిగిందని తెలిపారు. NMEO వనరులన్నింటిని 17% ఎస్సీలకు, 8% ఎస్టీలకు లబ్ధి చేర్చటానికి కేటాయించడం జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ/ఎస్టీ రైతులకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించటం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!