Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News 10 Thefts In Two Days In Warangal

Warangal: రెండు రోజుల్లోనే 10 చోరీలు.. 8 స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు

Published Date :September 7, 2023 , 11:16 am
By NTV WebDesk
Warangal: రెండు రోజుల్లోనే 10 చోరీలు.. 8 స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Warangal: గ్రేటర్ వరంగల్ లో దొంగలు రెచ్చిపోతున్నాయి. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి డోర్ హ్యాండిళ్లు, తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. గత రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో 10 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన సీపీ రంగనాథ్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతుంటే.. వాటిని నియంత్రించడంలో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్, కాజీపేట స్టేషన్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు కనెక్టివిటీ ఉండడంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దోపిడీ ముఠాలు తరచూ గ్రేటర్‌ను టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఠాలు అపార్ట్ మెంట్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో కాజీపేట పీఎస్ పరిధిలోని పీజీఆర్ అపార్ట్‌మెంట్‌లోని మూడు ఫ్లాట్లలో సుమారు 40 తులాల బంగారం, రూ.22 లక్షలు చోరీకి గురయ్యాయి. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఉన్న అపార్ట్‌మెంట్‌లో చోరీ జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న చోరీలను కూడా మధ్యప్రదేశ్ ముఠాలే చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Shahrukh Jawan: వంద కోట్ల ఓపెనింగ్… వెయ్యి కోట్ల కలెక్షన్స్…

దొంగతనానికి వచ్చే వారు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే పనులు పూర్తి చేయడం గమనార్హం. మంగళవారం చోరీలు జరిగిన ప్రాంతంలోని సీసీటీవీలో మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న కారు కనిపించడంతో దుండగులు అదే కారులో వచ్చి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాళాలు సైలెంట్ గా కోసేందుకు దుండగులు ప్రత్యేక సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చోరీలు చేసి తప్పించుకుంటున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నాం. వరంగల్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు సమాచారం. త్వరలోనే పట్టుకుంటామని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ లోని గాయత్రి, వాదిరాజు అపార్ట్ మెంట్లలో రెండు, హనుమకొండ పీఎస్ పరిధిలోని లహరి, కల్లెడ, మారుతీ వాసవీ నిలయం అపార్ట్ మెంట్లలో ఐదు చోరీలు జరిగి మొత్తం 155 తులాలకు పైగా బంగారం పోయింది.

Read also: Bhola Shankar : ఓటీటీ లో విడుదల కాబోతున్న భోళా శంకర్.. ఎప్పటి నుంచి అంటే..?

వరంగల్ పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ ఆలయంలో బుధవారం మూడు ఇళ్లలో చోరీ జరిగింది. దీంతో వరంగల్ సీపీ రంగనాథ్ నగర పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేశారు. వరుస దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ పరిధిలో 53 పీఎస్‌లు ఉండగా, గ్రేటర్ పరిధిలో 11 స్టేషన్లు ఉన్నాయి. సీపీ, తూర్పు, సెంట్రల్ జోన్ డీసీపీ, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏసీపీ, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ ఇలా రకరకాల పోలీసు బలగాలతో నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలకు, పోలీసులకు ఇబ్బందిగా మారుతున్నాయి. మొన్నటి వరకు కార్ల చోరీలతో బెంబేలెత్తిన గ్రేటర్ ప్రజలు.. ఇప్పుడు ఇళ్లలో దొంగతనాలతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే చోరీ కేసులను ఛేదించడంలో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో చోరీ కేసుల పరిష్కారం 50 శాతం లోపే ఉందంటే అర్థం చేసుకోవచ్చు.

Read also: ‘Bharat’ controversy: “భారత్‌”గా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్యసమితి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10 thefts in two days
  • 10 thefts in two days in Warangal
  • thefts
  • Warangal
  • Warangal 10 thefts in two days

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions