Kishan Reddy: దమ్ముంటే మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయటపెట్టు.. కేసీఆర్కు సవాల్
కుటుంబ పెత్తనం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం బీజేపీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి, అస్థిరత ఉంటుందని, బీఆర్ఎస్ కుటుంబ పెత్తనం పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానమని.. ధర్మం, దేశం బీజేపీ విధానమన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు రావాలంటే బీజేపీ కి ఓటు వేయాలన్నారు. తల తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటు.. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయట పెట్టాగలడా అని సవాలు విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఆ దమ్ము ఉందా?
సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, అసలు మెడికల్ కాలేజీలకి దరఖాస్తు చేసుకోలేదని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్ ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి BC సీఎం అంశం… బీసీ సామాజిక వర్గంలోని ప్రతి ఇంటా చర్చ జరుగుతుందని, ఇప్పటి వరకు బీసీ సీఎం కాలేదన్నారు. బీసీ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి… ఇది బీజేపీకి అదనంగా కలిసి రానుందన్నారు. బీసీ సీఎంను చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్కు ఉందా? అని సవాలు విసిరిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని, దలీతుడిని సీఎం చేసే దమ్ము ధైర్యం కేసీఆర్కు ఉందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ను సీఎం చేసినట్టు ఫాం హౌజ్లో పడుకొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. మహిళ మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడానికి కేసీఆర్కు సిగ్గుందా అని ధ్వజమెత్తారు. నిర్మల సీతారామన్ అన్ని వాస్తవమే మాట్లాడారన్నారు.
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
తెలంగాణలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్రమోది తెలంగాణ పర్యటనపై కిషన్ రెడ్డి స్పందించారు. త్వరలో ప్రధాన మంత్రి తెలంగాణలో పర్యటిస్తారన్నారు. 25,26,27 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ కి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులారా డిసెంబర్ మూడు వరకు వడ్లను అమ్ముకొకండి.. వరి కనీస ధర 3,100 రూపాయలు బీజేపీ ఇస్తుందని పేర్కొన్నారు. మూడో తేదీ తరవాత బీజేపీ అధికారంలోకి వస్తుంది.. వడ్లను కొంటుందన్నారు. రైతుల దగ్గర నుండి డబ్బుల వసూల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని చెప్పారు. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు. కంపెనీలు తీసుకునేవి, దొంగతనంగా వాడుకునే కరెంట్ అంత ఈ ప్రభుత్వం రైతుల ఖాతాలో వేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!