Kishan Reddy: దమ్ముంటే మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయటపెట్టు.. కేసీఆర్కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ పెత్తనం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం బీజేపీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి, అస్థిరత ఉంటుందని, బీఆర్ఎస్ కుటుంబ పెత్తనం పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానమని.. ధర్మం, దేశం బీజేపీ విధానమన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు రావాలంటే బీజేపీ కి ఓటు వేయాలన్నారు. తల తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటు.. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయట పెట్టాగలడా అని సవాలు విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఆ దమ్ము ఉందా?
సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, అసలు మెడికల్ కాలేజీలకి దరఖాస్తు చేసుకోలేదని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్ ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి BC సీఎం అంశం… బీసీ సామాజిక వర్గంలోని ప్రతి ఇంటా చర్చ జరుగుతుందని, ఇప్పటి వరకు బీసీ సీఎం కాలేదన్నారు. బీసీ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి… ఇది బీజేపీకి అదనంగా కలిసి రానుందన్నారు. బీసీ సీఎంను చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్కు ఉందా? అని సవాలు విసిరిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని, దలీతుడిని సీఎం చేసే దమ్ము ధైర్యం కేసీఆర్కు ఉందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ను సీఎం చేసినట్టు ఫాం హౌజ్లో పడుకొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. మహిళ మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడానికి కేసీఆర్కు సిగ్గుందా అని ధ్వజమెత్తారు. నిర్మల సీతారామన్ అన్ని వాస్తవమే మాట్లాడారన్నారు.
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
తెలంగాణలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్రమోది తెలంగాణ పర్యటనపై కిషన్ రెడ్డి స్పందించారు. త్వరలో ప్రధాన మంత్రి తెలంగాణలో పర్యటిస్తారన్నారు. 25,26,27 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ కి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులారా డిసెంబర్ మూడు వరకు వడ్లను అమ్ముకొకండి.. వరి కనీస ధర 3,100 రూపాయలు బీజేపీ ఇస్తుందని పేర్కొన్నారు. మూడో తేదీ తరవాత బీజేపీ అధికారంలోకి వస్తుంది.. వడ్లను కొంటుందన్నారు. రైతుల దగ్గర నుండి డబ్బుల వసూల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని చెప్పారు. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు. కంపెనీలు తీసుకునేవి, దొంగతనంగా వాడుకునే కరెంట్ అంత ఈ ప్రభుత్వం రైతుల ఖాతాలో వేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!