Telangana Elections 2023: తాండూరులో తీవ్ర ఉద్రిక్తత.. నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BRS at Tandur: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నా కొన్నిచోట్ల మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో సాయి పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపు పోలింగ్ కేంద్రంలో రోహిత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ నాయకుల నినాదాలు మొదలు పెట్టారు, రోహిత్ రెడ్డి రిగ్గింగ్ పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ అనంతరం పోలింగ్ కేంద్రం బయట కాంగ్రెస్ నాయకుల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఝుళిపించారు డీఎస్పీ శేఖర్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని రోడ్డుపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు.
Telangana Elections 2023: పోలింగ్ బూత్ ముందు తగలబడిన చెట్టు..ఆందోళనలో ఓటర్లు!
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఈ క్రమంలో పోలీసులు వారిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోపక్క మెదక్ జిల్లా నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం చర్చనీయాంశం అయింది. పరస్పరం వాహనాలపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగుతున్న అంశం హాట్ టాపిక్ అయింది. శివ్వంపేట మండలం భీమ్లా తండాలో కాంగ్రెస్ కార్యకర్త కారుపై దాడి జరిగింది, ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త సుధీర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ దాడి బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఇక మరో పక్క కాసేపటి క్రితమే నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడి కారుపై కొంత మంది వ్యక్తులు దాడి చేసిన అంశం కూడా తెర మీదకు వచ్చింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ (మం) అడ్వాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. 244 ,245 పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో గుంపుగా ఉన్న ఓటర్లను పోలీసులు అదుపు చేసే క్రమంలో ఓటర్ల పై లాఠీ ఝుళిపించారు పోలీసులు, ఈ క్రమంలో ముగ్గురికి గాయాలు కావడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఓటర్లు. దీంతో ఓటింగ్ కొద్దిసేపు ఆగింది.
తాజావార్తలు
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!